Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ప్రభాస్ సినిమా నుంచి షాకింగ్ అప్డేట్: దాని కోసమే రూ. 100 కోట్ల ఖర్చు
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత చేసిన 'సాహో' అన్ని భాషల్లో నిరాశ పరిచినప్పటికీ.. హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. దీంతో బాలీవుడ్ మేకర్లు అతడిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అతడితో పాన్ ఇండియా మూవీలు తెరకెక్కించేందుకు పోటీ పడ్డారు. ఇందులో భాగంగానే ప్రభాస్.. స్టార్ డైరెక్టర్ ఓం రౌత్తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఐదు భాషల్లో రూపొందించనున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉండబోతుందని ఇప్పటికే యూనిట్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీని కోసం దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ప్రపంచంలోనే పేరున్న రెండు వీఎఫ్ఎక్స్ కంపెనీల భాగస్వామ్యంలో ఈ సినిమా వర్క్ జరగబోతుదని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ను దర్శకుడు ఓం రౌత్ సదరు కంపెనీలకు వెల్లడించాడని, ఈ నేపథ్యంలోనే వాళ్లు వర్క్ కూడా మొదలెట్టారనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, టీ సిరీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్తో తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగానూ, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటించనున్నారు. అలాగే, టాల్ బ్యూటీ కృతీ సనన్ సీతగా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు సన్నీ సింగ్ కూడా ఇందులో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.