Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్కు బల్గేరియా ప్రభుత్వం లీగల్ నోటీసులు!
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్కు బల్గేరియా ప్రభుత్వం నుండి లీగల్ నోటీసులు అందాయి. అడవి పందుల వేటకు సంబంధించి కేసులో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్పోల్) ద్వారా ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్ విట్నెస్(సాక్షి)గా ఉన్నాడని, దీనిపై అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిందిగా ముంబై పోలీసులను ఇంటర్పోల్ కోరింది. త్వరలోనే పోలీసులు సైఫ్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది.
బల్గేరియాకు చెందిన ఓ ఏజెంట్ ఎలాంటి లైసెన్స్ లేకుండా, ప్రభుత్వం నుండి సరైన అనుమతి తీసుకోకుండా అడవి పందుల వేట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హంటింగ్ టెస్ట్ పాసవ్వకుండా ఇతర దేశాల పర్యాటకులు వేటలో పాల్గొనడం బల్గేరియా చట్టాల ప్రకారం నేరం. టెస్టు పాసైతేనే వారికి హంటింగ్ లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ పొందిన తర్వాత అక్కడ సందర్శకులు జంతువులను వేటాడొచ్చు.
బల్గేరియన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న అడవి పంది వేట కేసులో సైఫ్ అలీ కాన్ సాక్షిగా ఉండటంతో.... అతడి వాంగ్మూలం తీసుకోవాల్సిందిగా ఇంటర్పోల్ ద్వారా ముంబై పోలీసులుకు నోటీసులు అందాయి. త్వరలోనే సైఫ్ అలీ ఖాన్ను కలిసి బాంద్రా పోలీసులు ఈ కేసులో అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
సైఫ్ అలీ ఖాన్ గతంలో కృష్ణ జింకల వేటలో నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 19 ఏళ్ల అనంతరం ఈ కేసు నుండి నిర్దోషిగా బయట పడ్డారు. మళ్లీ వేటకు సంబంధించిన కేసులో అతడి పేరు వినిపించడం చర్చనీయాంశం అయింది.