Don't Miss!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్కు బల్గేరియా ప్రభుత్వం లీగల్ నోటీసులు!
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్కు బల్గేరియా ప్రభుత్వం నుండి లీగల్ నోటీసులు అందాయి. అడవి పందుల వేటకు సంబంధించి కేసులో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్పోల్) ద్వారా ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్ విట్నెస్(సాక్షి)గా ఉన్నాడని, దీనిపై అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిందిగా ముంబై పోలీసులను ఇంటర్పోల్ కోరింది. త్వరలోనే పోలీసులు సైఫ్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది.
బల్గేరియాకు చెందిన ఓ ఏజెంట్ ఎలాంటి లైసెన్స్ లేకుండా, ప్రభుత్వం నుండి సరైన అనుమతి తీసుకోకుండా అడవి పందుల వేట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హంటింగ్ టెస్ట్ పాసవ్వకుండా ఇతర దేశాల పర్యాటకులు వేటలో పాల్గొనడం బల్గేరియా చట్టాల ప్రకారం నేరం. టెస్టు పాసైతేనే వారికి హంటింగ్ లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ పొందిన తర్వాత అక్కడ సందర్శకులు జంతువులను వేటాడొచ్చు.
బల్గేరియన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న అడవి పంది వేట కేసులో సైఫ్ అలీ కాన్ సాక్షిగా ఉండటంతో.... అతడి వాంగ్మూలం తీసుకోవాల్సిందిగా ఇంటర్పోల్ ద్వారా ముంబై పోలీసులుకు నోటీసులు అందాయి. త్వరలోనే సైఫ్ అలీ ఖాన్ను కలిసి బాంద్రా పోలీసులు ఈ కేసులో అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
సైఫ్ అలీ ఖాన్ గతంలో కృష్ణ జింకల వేటలో నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 19 ఏళ్ల అనంతరం ఈ కేసు నుండి నిర్దోషిగా బయట పడ్డారు. మళ్లీ వేటకు సంబంధించిన కేసులో అతడి పేరు వినిపించడం చర్చనీయాంశం అయింది.