Don't Miss!
- Technology Whatsapp Filters వాట్సాప్లో ఫిల్టర్స్ పేరుతో కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..!!
- Sports IPL 2024: హార్దిక్ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- News టీడీపీ కోసం రంగంలోకి ముగ్గురు వ్యూహకర్తలు - గేమ్ ఛేంజ్..!!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
శ్రద్ధాకపూర్పై తీవ్ర అసంతృప్తి.. అందుకే ఆలస్యమట..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ రంగంలో బయోపిక్ల నిర్మాణం జోరందుకొన్నది. ఎంఎస్ ధోని, మేరి కోమ్, సచిన్, సంజూ, మహానటి లాంటి బయోపిక్లు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ఈ బయోపిక్లు అందించిన ఉత్సాహంతో బాలీవుడ్, టాలీవుడ్లో బయోపిక్లు మరిన్నీ రూపొందుతున్నాయి. ప్రస్తుతం బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఆ సైనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషిస్తున్నారు.
2017 నుంచి శ్రద్ధాకపూర్ బాడ్మింటన్ శిక్షణ పొందుతున్నట్టు సమాచారం. అయితే శ్రద్ధా శిక్షణపై సరిగా ధ్యాస పెట్టకపోవడంతో సైనా అసంతృప్తికి లోనవుతున్నట్టు తెలిసింది.
శ్రద్ధాకపూర్ ఎంత త్వరగా బాడ్మింటన్ శిక్షణ పూర్తి చేస్తే అంత త్వరగా సినిమాను పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో సైనా ఉన్నారు. ఈ చిత్రాన్ని అమోల్ గుప్తా రూపొందిస్తున్నారు. తన బయోపిక్ గురించి ఇటీవల సైనా మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. శ్రద్ధా సరిగా దృష్టిపెట్టడం లేదు అని సైనా అన్నారు.
సైనా బయోపిక్ ఆలస్యం కావడానికి కారణం ప్రధానంగా శ్రద్ధాకపూర్ అని తెలుస్తున్నది. ఈ బయోపిక్ను ఒప్పుకొన్న తర్వాత శ్రద్ధా ఇతర ప్రాజెక్టులతో బిజీగా మారింది. సాహో, స్త్రీ, బట్టి గుల్ మెటర్ ఛాలూ చిత్రాల్లో నటిస్తున్నది. త్వరలోనే నితీష్ తివారీ రూపొందించే చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సరసన నటించనున్నారు. దాంతో బాడ్మింటన్ శిక్షణకు సమయం కేటాయించలేకపోతున్నట్టు తెలిసింది.