Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ సమయంలో ఫోన్ చేశారు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన సైరాభాను...
దేశం గర్వించదగిన నటుడు దిలీప్ కుమార్ మరణంతో సినీ అభిమానులు, తారలు, ప్రేక్షకులు, సన్నిహితులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దిలీప్ కుమార్ ఇక లేరనే విషయాన్ని తెలుసుకోగానే ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఫోన్ చేసి దిలీప్ కుమార్ సతీమణి సైరాభానును, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న తనకు ఓదార్చు ఇచ్చిన మోదీకి సైరాభాను థ్యాంక్స్ చెబుతూ చేసిన ట్వీట్ ఏమిటంటే...
అసమాన నటనా ప్రతిభతో
దిలీప్ కుమార్ మరణించిన వెంటనే ప్రధాని మోదీ పరామర్శించారు. అలాగే ట్విట్టర్లో తన సంతాపాన్ని సందేశం రూపంలో వెల్లడిస్తూ.. దిలీప్ కుమార్ను సినిమాటిక్ లెజెండ్గా ఎప్పటికి గుర్తుంచుకొంటారు. అసమాన నటనా ప్రతిభతో అద్భుతమైన పాత్రలతో అన్ని తరాల ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశాడు.
సాంస్కృతికి ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటు. దిలీప్ మరణంతో విషాదంలో కూరుకుపోయిన అసంఖ్యాక అభిమానులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
సినీ ప్రముఖుల నివాళి
దిగ్గజ నటుడికి బాలీవుడ్ సినీ పరిశ్రమ ఘనంగా శ్రద్దాంజలి ఘటించింది. అమితాబ్, ధర్మేంద్ర, సుభాష్ ఘాయ్, విద్యాబాలన్, షారుక్ ఖాన్ తదితరుల దిలీప్ కుమార్ పార్దీవదేహాన్ని సందర్శించి చివరిచూపుగా నివాళులర్పించారు. ముంబై జుహు ప్రాంతంలో జరిగి అంత్యక్రియలకు కూడా పలువురు సినీ తారలు హాజరయ్యారు.
ప్రధాని ట్వీట్కు సైరా భాను స్పందించి
ప్రధాని మోదీ ట్వీట్కు స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీజీ.. బుధవారం ఉదయమే ఫోన్ కాల్ చేశారు. నన్ను పరామర్శించి మమల్ని ఓదార్చేందకు ప్రయత్నించారు. అందుకు సర్వదా మేము రుణపడి ఉంటాం అని సైరాభాను తన ట్వీట్లో పేర్కొన్నారు. దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. అలాగే మంత్రి పియూష్ గోయల్ ప్రభుత్వం తరుఫున తన సంతాప సందేశంలో శ్రద్దాంజలి ఘటించారు.
Recommended Video
సైరా భాను మరో ట్వీట్
ప్రధాని ట్వీట్కు సైరాభాను రిప్లై ఇస్తూ... దిలీప్ కుమార్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించినందుకు ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు థ్యాంక్యూ.. గొప్ప నటుడికి ఉన్నతంగా వీడ్కోలు చెప్పినందుకు అభిమానుల తరఫున, కుటుంబం తరఫున ధన్యవాదాలు అంటూ సైరా భాను మరో ట్వీట్లో పేర్కొన్నారు.