Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
లైలా మజ్ను గుండెను పిండేసేలా విషాద ప్రేమకథ.. ట్రైలర్లోనే డైరెక్టర్ ధమాకా!
ప్రేమకథా చిత్రాలను హృదయానికి హత్తుకునేలా రూపొందించే బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ కథ అందించిన చిత్రం లైలా మజ్ను. సాజిద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తృప్తి దిమ్రి, అవినాష్ తివారీ అనే కొత్త జంట ప్రేక్షకులకు పరిచయం అవుతున్నది.
లైలా మజ్ను చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేసి ఇంతియాజ్ ట్విట్టర్లో షేర్ చేశారు. లైలా మజ్ను ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా కనిపించింది. భావోద్వేగమైన సన్నివేశాలు.. చలాకీ డైలాగ్స్ సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని వెల్లడించాయి.
అమ్మాయిలను ఆకర్షించే తెలివి తేటలు ఉన్న అవినాష్ తివారీ కాయిస్ అనే పాత్రలో కనిపించారు. ఇక అవినాష్ను ఆకట్టుకొనే లైలా పాత్రలో తృప్తి నటించింది. సుందరమైన ప్రదేశాల్లో ఈ జంట రొమాన్స్ అద్భుతంగా కనిపించింది.
ప్రతీ ప్రేమలో మాదిరిగా వీరి రిలేషన్కు తృప్తి తండ్రి విలన్గా మారడం ఆ తర్వాత సినిమా విషాదంలోకి నెట్టినట్టు ట్రైలర్ స్పష్టంగా కనిపించింది. కశ్మీర్లో యువకులు ఎదుర్కొనే సమస్యలు కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం జరిగిందనే భావన ట్రైలర్ చూసినప్పుడు కలిగింది.
ఏక్తా కపూర్ నిర్మిస్తున్న లైలా మజ్ను చిత్రాన్ని తొలుత ఆగస్టు 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే వాయిదా వేసి సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు.