Don't Miss!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కాజోల్ మేనకోడలు కోసం సల్మాన్ పాట.. గాయకుడిగా మరోసారి
హ్యాంగోవర్, మై హూ హీరో తెరా సినిమాల్లో పాటలు పాడిన తర్వాత మరోసారి సల్మాన్ ఖాన్ గాయకుడిగా మారారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న నోట్బుక్ చిత్రం కోసం తన గొంతు సవరించుకొన్నారు. ఈ చిత్రంలో మై తారే అంటూ సల్మాన్ పాడిన పాటకు విశేష స్పందన వస్తున్నది. ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
తాను పాడిన పాటను సల్మాన్ ఖాన్ పలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ట్రెండింగ్ మారింది. ఈ పాటను ప్రనుతన్, జహీర్ ఇక్బాల్పై చిత్రీకరించనున్నారు. వీరిద్దరూ కూడా నోట్ బుక్ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్తో కలిసి సల్మాన్ ఖాన్ నిర్మించారు.
హీరోయిన్గా పరిచయం అవుతున్న ప్రానూతన్ ప్రముఖ హీరోయిన్లు నూతన్, తనూజా మనువారలు. అలాగే మైనే ప్యార్ కియా లాంటి చిత్రాల్లో నటించిన మొహనీష్ బెహల్ కూతురు. అంతేకాకుండా హీరోయిన్ కాజోల్ మేనకోడలు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.