Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కాజోల్ మేనకోడలు కోసం సల్మాన్ పాట.. గాయకుడిగా మరోసారి
హ్యాంగోవర్, మై హూ హీరో తెరా సినిమాల్లో పాటలు పాడిన తర్వాత మరోసారి సల్మాన్ ఖాన్ గాయకుడిగా మారారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న నోట్బుక్ చిత్రం కోసం తన గొంతు సవరించుకొన్నారు. ఈ చిత్రంలో మై తారే అంటూ సల్మాన్ పాడిన పాటకు విశేష స్పందన వస్తున్నది. ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
తాను పాడిన పాటను సల్మాన్ ఖాన్ పలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ట్రెండింగ్ మారింది. ఈ పాటను ప్రనుతన్, జహీర్ ఇక్బాల్పై చిత్రీకరించనున్నారు. వీరిద్దరూ కూడా నోట్ బుక్ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్తో కలిసి సల్మాన్ ఖాన్ నిర్మించారు.
హీరోయిన్గా పరిచయం అవుతున్న ప్రానూతన్ ప్రముఖ హీరోయిన్లు నూతన్, తనూజా మనువారలు. అలాగే మైనే ప్యార్ కియా లాంటి చిత్రాల్లో నటించిన మొహనీష్ బెహల్ కూతురు. అంతేకాకుండా హీరోయిన్ కాజోల్ మేనకోడలు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.