Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
కాజోల్ మేనకోడలు కోసం సల్మాన్ పాట.. గాయకుడిగా మరోసారి
హ్యాంగోవర్, మై హూ హీరో తెరా సినిమాల్లో పాటలు పాడిన తర్వాత మరోసారి సల్మాన్ ఖాన్ గాయకుడిగా మారారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న నోట్బుక్ చిత్రం కోసం తన గొంతు సవరించుకొన్నారు. ఈ చిత్రంలో మై తారే అంటూ సల్మాన్ పాడిన పాటకు విశేష స్పందన వస్తున్నది. ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
తాను పాడిన పాటను సల్మాన్ ఖాన్ పలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ట్రెండింగ్ మారింది. ఈ పాటను ప్రనుతన్, జహీర్ ఇక్బాల్పై చిత్రీకరించనున్నారు. వీరిద్దరూ కూడా నోట్ బుక్ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్తో కలిసి సల్మాన్ ఖాన్ నిర్మించారు.
హీరోయిన్గా పరిచయం అవుతున్న ప్రానూతన్ ప్రముఖ హీరోయిన్లు నూతన్, తనూజా మనువారలు. అలాగే మైనే ప్యార్ కియా లాంటి చిత్రాల్లో నటించిన మొహనీష్ బెహల్ కూతురు. అంతేకాకుండా హీరోయిన్ కాజోల్ మేనకోడలు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.