Don't Miss!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇదేందయ్య ఇది.. సల్మాన్ కి కృష్ణజింకల సన్మానమా?.. ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారుగా!
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ఒక ఫోటో కారణంగా వార్తల్లో నిలిచారు. నిజానికి సల్మాన్ ఖాన్ ఇటీవల ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానుతో కలిసి ఫోటో దిగాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వైరల్ ఫోటో ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతోంది అంటే ఆ ఫోటోలో సల్మాన్ ధరించిన శాలువా. టోక్యో ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల సల్మాన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇక ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ మీరాబాయితో ఫోటోలు దిగుతున్నప్పుడు సల్మాన్ ఖాన్ భుజాలపై తెల్లటి శాలువా ఉంది. ఈ శాలువ దిగువ భాగంలో ఒక జంతువు ఉన్నట్టి స్పష్టంగా కనిపిస్తోంది.
అందరూ ఇది ఒక కృష్ణ జింక అని భావిస్తున్నారు. కృష్ణ జింక ఉన్న నేపధ్యంలో సల్మాన్ ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అందులో ఒక నెటిజన్ అయితే సల్మాన్ భాయ్, శాలువాలో కృష్ణ జింక ఉందా?, ఆ శాలువా తీసి పక్కన పెట్టండి, నేను కృష్ణ జింక నుండి నా కళ్ళు తిప్పలేక పోతున్నాను అంటూ కామెంట్ చేశారు. అయితే అన్డుతుహున్న సమాచారం మేరకు మీరు సల్మాన్ ఖాన్ ఫోటోను దగ్గర నుండి చూస్తే, సల్మాన్ శాలువపై ఉన్న జంతువు కృష్ణ జింక కాదని, మీరాబాయి సొంత రాష్ట్రం మణిపూర్కు చెందిన సంగై జింక అని అని అంటున్నారు. ఇది మణిపూర్ రాష్ట్ర జంతువని అంటున్నారు.
1998 లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ జింకల వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మరియు అతని సహ నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రే మరియు దుష్యంత్ సింగ్ కంకణి గ్రామంలో కృష్ణజింకను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టులో కేసు చాలా రోజులే నడిచింది. అయితే 2018 సంవత్సరంలో, ఏప్రిల్ 5 న, జోధ్పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్ను కృష్ణజింకల వేట కేసులో దోషిగా నిర్ధారించి, అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మిగిలిన నిందితులు సైఫ్ అలీఖాన్, నీలం, సోనాలి, టబు మరియు దుష్యంత్ సింగ్ నిర్దోషులుగా విడుదలయ్యారు. దీని తరువాత, డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ కోర్టు, సల్మాన్కు వ్యతిరేకంగా దిగువ కోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ, అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల గురించి మాట్లాడాలి అంటే తన సినిమాల షూటింగ్లో నిరంతరం బిజీగా గడుపుతున్నాడు ఆయన. సల్మాన్ తన సినిమాల షూటింగ్ను చాలా త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సల్మాన్ సెప్టెంబర్ చివరి నుండి షో బిగ్ బాస్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఇక చివరిసారిగా ఆయన రాధే సినిమాలో కనిపించగా ఇప్పుడు టైగర్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరిన్ని పెద్ద సినిమాలకు కూడా ఆయన సైన్ చేశారు.