గణపతి నిమజ్జనంలో సల్మాన్, హృతిక్, శిల్ప, శ్రద్దా.. వినాయకుడికి ఘనంగా వీడ్కోలు
ఆది దేవుడు వినాయకుడు పండుగను బాలీవుడ్ తారలు భక్తి శ్రద్దలతో జరుపుకొన్నారు. గణేషుడికి ప్రార్థనలు, పూజలు చేసి తమ భక్తిని చాటుకొన్నారు. మూడు రోజలు తర్వాత గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సల్మాన్ ఖాన్ ఇంటిలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో బాలీవుడ్ తారలు కూడా పాల్గొన్నారు. సల్మాన్ స్నేహితులు లూలియా వాంటర్, డైసీ షా తదితరులు పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ పూజలో అర్పితా ఖాన్ తదితరులు పాల్గోన్నారు. లూలియా, డైసీ షా దీపారాధన చేశారు.
హృతిక్ రోషన్ ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మాత్రమే నిమజ్జనంలో పాల్గొన్నారు. రాకేశ్ రోషన్, పింకీ రోషన్, సునైనా రోషన్, మాజీ భార్య సుజాన్ ఖాన్తోపాటు హృతిక్ కుమారులు రోషన్, హ్రిదాన్ నిమజ్జన కార్యక్రమంలో ప్రార్థనలు చేశారు.

ఇక చంకీ పాండే ఇంటిలో కూడా గణపతి నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్దలతో సాగింది. బాలీవుడ్ తార అనన్య పాండే గణపతి దేవుడిని ఎత్తుకొని ఊరేగించారు. భక్తితో ఆయనకు వీడ్కోలు తెలిపారు. ఇక శ్రద్దాకపూర్ కూడా నిమజ్జన వేడుకలో పాలుపంచుకొన్నారు. వినాయకుడి ప్రతిమను ఎత్తుకొని నిమజ్జనానికి స్వయంగా తరలివచ్చారు.

శిల్పాశెట్టి నివాసంలో కూడా గణపతి నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్ కుంద్రా, తన కుమారుడితో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.




Click it and Unblock the Notifications











