Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రముఖ సినీ క్రిటిక్పై సల్మాన్ పరువు నష్టం దావా.. ఈ వివాదంపై ఇరువర్గాలు క్లారిటీ!
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం చెత్తగా ఉందంటూ వ్యాఖ్యలు చేసి ప్రముఖ సినీ విమర్శకుడు, దర్శకుడు కమల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే వివాదంలో కూరుకుపోయారు. రాధే సినిమాపై రివ్యూ రాశారన్న కోపంతోనే కేఆర్కేపై పరువు నష్టం దావా వేశాడనే విషయం బాలీవుడ్ మీడియాలో వైరల్ అయింది. అయితే కేఆర్కే మీద పరువు నష్టం వేసింది సినిమాపై రివ్యూ రాసినందుకు కాదు. అలాంటి కథనాల్లో వాస్తవం లేదు అంటూ సల్మాన్ లీగల్ టీమ్ వివరణ ఇచ్చింది.
సల్మాన్ ఖాన్ అవినీతిపరుడు, బీయింగ్ హ్యూమన్ సంస్థతో అనేక కుంభకోణాలకు పాల్పడ్డవారు. మనీలాండరింగ్ వ్యవహారాలకు తెర తీశాడు. సల్మాన్ ఖాన్ సినిమాలన్నీ ప్రజలను కొల్లగొట్టే దోపిడి దొంగల్లాంటివి అంటూ ఓ కథనాన్ని రాసి మీడియా ద్వారా ప్రచారం చేశారు. అలాంటి కథనాలు సల్మాన్ పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించే ఉన్నాయని భావించినందున ఆయనపై పరువు నష్టం దావా దాఖలు చేశాం అంటూ సల్మాన్ లీగల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
సల్మాన్ ఖాన్ లీగల్ టీమ్ జారీ చేసిన నోటీసులను ఇటీవల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకొన్నారు. రాధే సినిమాపై రివ్యూ రాసినందుకే తనకు లీగల్ నోటీసులు ఇచ్చారు అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.
సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసుల నేపథ్యంలో ప్రముఖ రచయిత, సల్లూభాయ్ తండ్రి సలీంఖాన్ బహిరంగ లేఖ రాశారు. గౌరవనీయులైన సలీం సాహెబ్. సల్మాన్ ఖాన్ కెరీర్ను నాశనం చేయడానికి ఇక్కడ లేను. నా సంతోషం కోసం సినిమాలను రివ్యూ చేస్తాను. నా రివ్యూల వల్ల సల్మాన్ ఖాన్ ఇబ్బంది పడుతున్నాడంటే నేను రివ్యూలు ఇవ్వడం మానేస్తాను. నా సినిమాలను కనుక రివ్యూ చేయవద్దని సల్మాన్ ఖాన్ చెప్పి ఉంటే నేను ఆ పని చేసేవాడిని కాదు అంటూ అని కేఆర్కే సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది.