Don't Miss!
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రైతుల ఆందోళనపై పెదవి విప్పిన సల్మాన్ ఖాన్.. హాట్ కామెంట్లు చేసిన కండల వీరుడు
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతుల ఆందోళన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. రైతన్న ఉద్యమంపై సెలబ్రిటీల తమకు తోచిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ సెలబ్రిటీ గ్రేటా, పాప్ సింగర్ రిహన్నా చేసిన వివాదాస్పద కాగా, వారికి భారతీయ సినిమా నటీనటులు అక్షయ్ కుమార్, కరణ్ జోహర్ ఘాటుగా స్పందించారు.
ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. రైతులకు మంచి జరుగుతుందనే పనులను తప్పకుండా చేయాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాల్సిందే. దేశానికి, రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అంతిమ్ అనే చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో సిక్కు మతానికి చెందిన పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయుష్ శర్మ హీరోయిన్గా నటిస్తున్నది.
ఇదిలా ఉండగా, ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటించిన రాధే చిత్రం రంజాన్ పండుగ కానుకగా రిలీజ్ కానున్నది. ఇది కాకుండా టైగర్ 2, కిక్ 2, కభీ ఈద్ కభీ దీవాళీ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.