Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలీవుడ్ అగ్ర హీరో సినిమా నుంచి తప్పుకున్న దేవిశ్రీప్రసాద్.. పుష్ప తరువాత గోల్డెన్ ఛాన్స్ మిస్
రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇటీవల పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ ఎలాంటి సినిమా చేసినా కూడా తప్పకుండా మ్యూజిక్ లో సక్సెస్ అవుతాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల కాలంలో వేరే సినిమాలతో మాత్రం దేవిశ్రీప్రసాద్ అంతగా సక్సెస్ కాలేదు. కేవలం అతనికి పుష్ప సినిమాతోనే భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందింది. అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు ఆఫర్లు వచ్చాయి.
అయితే దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా ఫాలో కాలేను అని కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఒక సినిమాకు వర్క్ చేస్తే పూర్తిస్థాయిలో చేస్తానని చెప్పిన దేవి ఒకటి రెండు పాటలు కంపోజ్ చేసి తప్పుకోలేను అని కొన్ని పెద్ద సినిమాలను మిస్ చేసుకున్నాడు. అయితే మొదటిసారి అతనికి ఒక స్టార్ హీరో మాత్రం పూర్తిస్థాయిలో సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం ఇవ్వడానికి ఇటీవల రెడీ అయినట్లు ఒక టాక్ వినిపించింది.
అతను మరెవరో కాదు సల్మాన్ ఖాన్ అని వార్తలు అయితే గట్టిగానే వచ్చాయి. సల్మాన్ ఖాన్ నుంచి త్వరలో రాబోయే కబీ ఈద్ కబీ దివాళి అనే సినిమాకు దేవిశ్రీప్రసాద్ రీసెంట్ గా కొన్ని ట్యూన్స్ కూడా ఇచ్చాడట. అయితే అవన్నీ కూడా అంతగా సంతృప్తి అనిపించకపోవడంతో సల్మాన్ ఖాన్ అతన్ని ప్రాజెక్టు నుంచి తప్పించినట్లుగా కొత్త టాక్ వినిపిస్తోంది. దేవిశ్రీప్రసాద్ బాగానే కష్టపడి ట్యూన్స్ రెడీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ మాత్రం కనెక్ట్ కాలేదట. దర్శకుడితో కూడా దీనికి కొన్ని విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
దేవిని కాదని సల్మాన్ KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ ని సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఈ విషయంపై అయితే ఇంకా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం తెలుగులోనే కొన్ని ప్రాజెక్టులతో దేవి శ్రీ ప్రసాద్ బిజీగా ఉన్నాడు. అలాగే సుకుమార్ తోనే మరోసారి పుష్ప సెకండ్ పార్ట్ కోసం వర్క్ చేయబోతున్నాడు. ప్రస్తుతం థమన్ హవా ఎక్కువగా కొనసాగుతుండటంతో ఇంతకుముందు దేవితో వర్క్ చేసిన దర్శకులు కూడా థమన్ వైపే మొగ్గు చూపుతుండటం విశేషం. మరి దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడో చూడాలి.