బాహుబలి, కేజీఎఫ్ బద్దలుకొట్టాయి.. నా నెక్ట్స్ మూవీ అలాంటిదే తీస్తా.. సందీప్ రెడ్డి వంగా
Recommended Video
టాలీవుడ్లో సెన్సేషనల్ సక్సెస్ సాధించిన అర్జున్ రెడ్డి చిత్రంలో హిందీలో రీమేక్గా కబీర్ సింగ్ పేరుతో రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమాలో షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించాడు. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రను షాహీద్ కపూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కబీర్ సింగ్లో అర్జున్ కపూర్ను కాకుండా షాహీద్ కపూర్ను ఎందుకు తీసుకొన్నాననే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తావించారు. అలాగే మహేష్ బాబు, ఇతర సినిమాల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంటర్యూలో ఆయన చెప్పిన విషయాలు..

అర్జున్ రెడ్డిని అలా కబీర్ సింగ్గా మార్చాను
అర్జున్ రెడ్డి కథను బాలీవుడ్కు అనుగుణంగా రూపొందించాం. పంజాబ్కు చెందిన యువకుడు ముంబైలో పెరిగి.. ఢిల్లీలో మెడిసిన్ చదువుకొనే అంశంగా తెరకెక్కించడం నాకు సవాల్గా నిలిచింది. అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్గా మార్చడం నాకు అత్యంత సంతృప్తిని కలిగిచింది అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు.

అర్జున్ రెడ్డితో చెప్పలేనంత అనుబంధం
అర్జున్ రెడ్డితో నాకు చెప్పలేనంత అనుబంధం ఉంది. నా జీవితంలో ఎంత ప్రభావం చూపించిందంటే.. నా కొడుకు పేరును కూడా అర్జున్ రెడ్డిగా పెట్టుకొన్నాను. అర్జున్ రెడ్డి సినిమాకు నా తండ్రి ప్రభాకర్, ప్రణయ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. నాకే కాదు.. నా కుటుంబానికి కూడా అర్జున్ రెడ్డి అలా దగ్గరయ్యాడు.

అర్జున్కపూర్ను ఎందుకు తీసుకోలేదంటే
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కోసం అర్జున్ కపూర్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అయితే ముందుగా షాహీద్ కపూర్తో చర్చలు ప్రారంభించినందున ఆయన గురించి ఆలోచించలేదు. ఒకసారి షాహీద్ కరెక్ట్ అనిపించిన తర్వాత అర్జున్ గురించి పట్టించుకోలేదు. ఇక ప్రీతి పాత్రకు కియారా అద్వానీ కరెక్ట్ అని భావించాం. ఆమె ఆ పాత్రను అద్భుతంగా అర్థం చేసుకొని అందులో జీవించింది అని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.

మహేష్ బాబుతో సినిమా గురించి
మహేష్ బాబుతో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమా ఆయన యాక్టింగ్ టాలెంట్కు, నేను రచనా ప్రతిభకు సవాల్గా నిలిచేలా ఉంటుంది. ఇంకా కథ, ప్రాజెక్ట్ గురించి క్లారిటీ లేదు. మా ప్రాజెక్టులతో మేము బిజీగా ఉన్నాం. మా కమిట్మెంట్స్ను పూర్తి చేసుకొన్న తర్వాత ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాం అని సందీప్ రెడ్డి అన్నారు.

బాహుబలి, కేజీఫ్ సినిమాల గురించి
నా తదుపరి సినిమా జాతీయ స్థాయి ప్రాజెక్ట్లా ఉంటుంది. ఓ క్రైమ్ డ్రామాకు సంబంధించిన కథను రాస్తున్నాను. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచిని పరిశీలిస్తే.. హిందీ, తెలుగుకు మధ్య వ్యత్యాసం లేదు. బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలు భాషా గోడలను బద్దలు కొట్టాయి. నా సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుంది అని సందీప్ రెడ్డి వంగా అన్నారు.


Click it and Unblock the Notifications











