Don't Miss!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
నిర్మాతగా మారిన సందీప్ రెడ్డి వంగ.. రణ్బీర్తో మూవీ... సర్ప్రైజింగ్ వీడియోతో హల్చల్!
టాలీవుడ్లో అర్జున్ రెడ్డితో, బాలీవుడ్లో కబీర్ సింగ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ డైరెక్టర్గా మారిన సందీప్ రెడ్డి వంగ మరో క్రేజీ కాంబినేషన్తో ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. లాక్డౌన్ కారణంగా సినిమా ప్రారంభం ఆగిపోవడంతో దాదాపు 10 నెలలు ఆలస్యమైంది. అయితే లాక్డౌన్ తర్వాత సినీ నిర్మాణాలు వేగం కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలపైకి తీసుకువస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ సినిమా గురించి మరిన్నీ వివరాలు...
సందీప్ రెడ్డి వంగ మూడో చిత్రం
అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి వంగ తన రెండో చిత్రం కోసం బాలీవుడ్లో అడుగుపెట్టారు. తాను దర్వకత్వం వహించిన అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్గా రీమేక్ చేశారు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లతో స్టార్ డైరెక్టర్గా మారాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో మూడో చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
టీ సిరీస్తో కలిసి సొంత బ్యానర్పై
రణ్బీర్ కపూర్తో తెరకెక్కించే చిత్రానికి బాలీవుడ్లో భారీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ సిద్ధమైంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై సందీప్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, కిషన్కుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.
ఫ్యాన్స్కు జోష్ను కలిగించే వీడియోతో
రణ్బీర్ సింగ్తో రూపొందించే చిత్రం కోసం సర్ప్రైజింగ్ వీడియోతో హల్చల్ చేసేందుకు రెడీ అయ్యారు. జనవరి 1వ 2021 తేదీన మధ్యాహ్నం 12.01 గంటలకు టీ సిరీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారు. దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం పెరిగింది.
రణ్బీర్ ఇమేజ్కు భిన్నంగా
బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రణ్బీర్ సింగ్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ ిత్రం యాక్షన్, థ్రిల్లర్గా రూపొందుతున్నట్టు సమాచారం. రణ్బీర్ ఇమేజ్కు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తున్నది. ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా జరిగితే.. ఈ చిత్రం 2021 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.