Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
నిర్మాతగా మారిన సందీప్ రెడ్డి వంగ.. రణ్బీర్తో మూవీ... సర్ప్రైజింగ్ వీడియోతో హల్చల్!
టాలీవుడ్లో అర్జున్ రెడ్డితో, బాలీవుడ్లో కబీర్ సింగ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ డైరెక్టర్గా మారిన సందీప్ రెడ్డి వంగ మరో క్రేజీ కాంబినేషన్తో ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. లాక్డౌన్ కారణంగా సినిమా ప్రారంభం ఆగిపోవడంతో దాదాపు 10 నెలలు ఆలస్యమైంది. అయితే లాక్డౌన్ తర్వాత సినీ నిర్మాణాలు వేగం కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలపైకి తీసుకువస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ సినిమా గురించి మరిన్నీ వివరాలు...
సందీప్ రెడ్డి వంగ మూడో చిత్రం
అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి వంగ తన రెండో చిత్రం కోసం బాలీవుడ్లో అడుగుపెట్టారు. తాను దర్వకత్వం వహించిన అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్గా రీమేక్ చేశారు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లతో స్టార్ డైరెక్టర్గా మారాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో మూడో చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
టీ సిరీస్తో కలిసి సొంత బ్యానర్పై
రణ్బీర్ కపూర్తో తెరకెక్కించే చిత్రానికి బాలీవుడ్లో భారీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ సిద్ధమైంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై సందీప్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, కిషన్కుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.
ఫ్యాన్స్కు జోష్ను కలిగించే వీడియోతో
రణ్బీర్ సింగ్తో రూపొందించే చిత్రం కోసం సర్ప్రైజింగ్ వీడియోతో హల్చల్ చేసేందుకు రెడీ అయ్యారు. జనవరి 1వ 2021 తేదీన మధ్యాహ్నం 12.01 గంటలకు టీ సిరీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారు. దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం పెరిగింది.
రణ్బీర్ ఇమేజ్కు భిన్నంగా
బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రణ్బీర్ సింగ్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ ిత్రం యాక్షన్, థ్రిల్లర్గా రూపొందుతున్నట్టు సమాచారం. రణ్బీర్ ఇమేజ్కు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తున్నది. ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా జరిగితే.. ఈ చిత్రం 2021 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.