Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
గుడ్బై ఇక జీవితంలో ముఖం చూడను.. సుశాంత్ హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో దాదాపు 28 మందిని ఇప్పటికే ప్రశ్నించడం తెలిసిందే. మంగళవారం రోజున దిల్ బేచారా హీరోయిన్ను సుమారు 10 గంటలపాటు ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అంత సుదీర్ఘంగా చర్చించడం మీడియాలో రకరకాల అనుమానాలకు దారి తీసింది. అయితే అలాంటి అనుమానాల మధ్య దిల్ బేచారా హీరోయిన్ సంజనా సంఘీ సోషల్ మీడియాలో సెన్సేషనల్గా పోస్టు పెట్టడం పలు అనుమానాలకు దారి తీసింది.
సుశాంత్పై మీటూ ఆరోపణలపై క్లారిటీ
బాలీవుడ్లో గతేడాది మీటూ ఉద్యమం జరిగిన సమయంలో సుశాంత్పై సంజన సంఘీ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్టు వార్తలు రావడం సంచలనం రేపాయి. అయితే ఆ సమయంలో సంజన అమెరికాలో ఉండటంతో ఈ ఆరోపణలపై కాస్త ఆలస్యంగా స్పందించారు. ఆ సమయంలో తన సోషల్ మీడియా అకౌంట్లో స్పందిస్తూ.. యూఎస్ నుంచి వస్తున్నాను. సుశాంత్పై నేను చేసినట్టు వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.
సుదీర్ఘ విచారణ తర్వాత మనస్తాపం
ముంబై పోలీసులు మంగళవారం దిల్ బేచారా హీరోయిన్ సంజనా సంఘీని సుదీర్ఘంగా విచారించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తున్నది. గతంలో మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో సుశాంత్పై ఆరోపణలు సంజన చేయడం మీడియాలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో సంజన సంఘీని మీటూ ఆరోపణలను ప్రశ్నించినట్టు సమాచారం. పోలీసుల ప్రశ్నలకు బెంబేలెత్తిన సంజన తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నది.
ముంబై ఎయిర్పోర్టు నుంచి
బాంద్రా పోలీసుల విచారణ అనంతరం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తూ ఎయిర్పోర్టు నుంచి తన ఇన్స్టాగ్రామ్లో సెన్సేషనల్ పోస్టు పెట్టారు. ఇక ఎన్నడూ ముంబైకి తిరిగి రాకపోవచ్చు అంటూ సంచలన కామెంట్ను పోస్టు చేశారు. ముంబై గుడ్బై. నాలుగు నెలల తర్వాత ముంబైకి వచ్చాను. మళ్లీ ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. మీ దారులు, వ్యవహారం వేరేలా కనిపిస్తున్నది అని అంటూ పోస్టులో పేర్కొన్నారు.
నేను మీలానే బాధలో ఉన్నాను
ప్రస్తుతం నేను చాలా బాధలో ఉన్నాను. దు:ఖంలో నా కళ్ల వెంట ధారాళంగా కన్నీరు జారుతున్నది. మీ గుండెలో కూడా కొంత బాధ ఉండి ఉంటుందని అనుకొంటున్నాను. వీలైతే మళ్లీ కలుద్దాం. కలవకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ సంజన సంఘీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టడం సినీ, సోషల్ మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
Recommended Video
దిల్ బేచారాలో సుశాంత్తో
ఇక సంజన సంఘీ, సుశాంత్ సింగ్ రాజ్పుత్ కలిసి నటించిన దిల్ బేచారా చిత్రం విడుదలకు సిద్దమైంది. సుశాంత్ సింగ్ సూసైడ్ అనంతరం రిలీజ్ చేస్తున్న చివరి సినిమాగా దిల్ బేచారా మారబోతున్నది. ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్ఫాం డిస్నీ+హాట్స్టార్ జూలై 24 తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని నిర్మాత, దర్శకులు