Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘కేదార్నాథ్’ నిషేధంపై సారా అలీ ఖాన్ అసంతృప్తి
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ 'కేదార్నాథ్' సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఉత్తరఖండ్లోని కేదార్నాథ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన ఈ చిత్రం.... ఉత్తరఖండ్లో నిషేదానికి గురైంది.
తన సినిమా బ్యాన్ చేయడంపై సారా అలీ ఖాన్ స్పందించారు. ఈ నిర్ణయం తనను ఎంతో డిసప్పాయింట్మెంటుకు గురి చేసిందని తెలిపారు. నటిగా నా జర్నీ ఉత్తరఖండ్ ప్రజలతో మొదలైందని, 45 రోజుల పాటు అక్కడ షూటింగులో పాల్గొన్నాను. అలాంటి చోటు నా సినిమా విడుదల కాక పోవడం అసంతృప్తికి గురి చేసిందన్నారు.
కేదార్నాథ్ దర్శనానికి వచ్చిన హిందూ అమ్మాయి... ముస్లిం యువకుడితో ప్రేమలో పడే కథతో ఈ చిత్రం రూపొందించారు. దీంతో ఈ చిత్రం లవ్ జిహాద్ను ప్రోత్సహించే విధంగా ఉందంటూ కొన్ని సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలతో ఉత్తరఖండ్ ప్రభుత్వం సినిమాపై నిషేధం విధించింది.
అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇండియాలో ఇప్పటి వరకు రూ. 54 కోట్ల బిజినెస్ చేసింది. తొలివారం రూ. 42.45 కోట్లు వసూలవ్వగా.... సెకండ్ వీకెండ్ రూ. 11.76 కోట్లు రాబట్టింది. నటిగా సారా అలీ ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.