సుశాంత్తో సారా బ్యాంకాక్ ట్రిప్.. 3 రోజులు హోటల్ నుంచి రాకుండా.. రియా అబద్దం అలా!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడంటూ రియా చక్రవర్తి ఇటీవల జాతీయ టెలివిజన్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ పారిస్ పర్యటనలో జరిగిన విషయాలను చెబుతూనే సుశాంత్ తన 'మగ' స్నేహితులతో కలిసి బ్యాంకాక్కు వెళ్లాడనే విషయాన్ని రియా బయటపెట్టింది. అయితే తాజాగా సుశాంత్ సన్నిహితులు టైమ్స్ నౌ లైవ్ షోలో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. ఆ పర్యటనలో సుశాంత్తోపాటు సారా ఆలీ ఖాన్ కూడా ఉంది.
Recommended Video
పర్యటనకు వెళ్లిన వారిలో గర్ల్స్ లేరని చెప్పడంతో రియా వాస్తవాలను దాచి పెట్టిందనే కోణాన్ని పలువురు ఆవిష్కరిస్తున్నారు. అయితే బ్యాంక్ పర్యటన గురించి రియా ఎందుకు అబద్ధం ఆడిందనే విషయం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సుశాంత్, సారా ట్రిప్ గురించి మరిన్ని విషయాలు..

విలాసవంతమైన హోటల్లో
బ్యాంకాక్లోని విలాసవంతమైన ఐలాండ్ ఓ హోటల్లో బస చేశాం. సుశాంత్, సారా ఆలీ ఖాన్ ఆ హోటల్ నుంచి మూడు రోజులపాటు ఉన్నారు బయటకు కూడా రాలేదు. మేమంతా బ్యాంకాక్లోని ప్రదేశాలు చూడటానికి వెళ్లాం అని సాబిర్ చెప్పడం సరికొత్త వివాదానికి తెరతీసింది.

సునామీ హెచ్చరికలతో మధ్యలోనే
అయితే థాయ్లాండ్కు సునామీ హెచ్చరికలు రావడంతో బ్యాంకాక్ ట్రిప్ అనూహ్యంగా మధ్యలోనే ఆపేసి సుశాంత్, సారా ఆలీ ఖాన్ ముంబైకి తిరిగి వచ్చారు. మిగితా ఆరుగురం మాత్రం నెల రోజులపాటు అక్కడే ఉన్నాం. బ్యాంకాక్ ఖర్చుల కోసం సుశాంత్ తన ఏటీఎం కార్డును మాకు ఇచ్చారు అని సాబిర్ ఆహ్మద్ తెలిపారు.

రియా దాపరికంపై చర్చ
అయితే తాజా ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి ఎందుకు అబద్దం ఆడారనే విషయం ఇప్పుడు మీడియాలో హైలెట్ అవుతున్నది. సారా వెళ్లిన విషయం తెలియదా? ఉద్దేశపూర్వకంగానే ఆమె ఈ విషయాన్ని దాచి పెట్టారా? లీక్ చేయడంలో భాగంగా ఆమె ఈ ట్రిప్ వ్యవహారాన్ని బయటపెట్టిందా అనే విషయాలపై ఇప్పుడు మీడియాలో చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











