twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుక్ ను టార్గెట్ చేసిన సయానీ గుప్తా

    |

    మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా షారుక్‌ ఖాన్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం వివాదానికి కారణమయ్యింది. ఈ ట్వీట్‌పై ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ఫేమ్‌ సయాని గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. కింగ్ ఖాన్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేసింది . గాంధీ జయంతి సందర్భంగా షారుక్‌ ఖాన్‌ 'ఈ సమయంలో మన పిల్లలకు ఒకే ఆదర్శం బోధించాలి. పిల్లలు చెడు వినకూడదు.. చూడకూడదు.. మాట్లాడకూడదు. 151వ జయంతి సందర్భంగా గాంధీ విలువలను స్మరించుకోవాలి' అంటూ ట్వీట్‌ చేశారు.

    ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఫోర్ మోర్ షాట్స్ ఫేమ్ నటి సయానీ గుప్తా ఈ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరూ నిజం మాట్లాడడానికి సాహసికమని, హక్కుకోసం గళం ఎత్తాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. " 'పిల్లలకు మంచి విషయాల గురించి చెప్పండి. సత్యం కోసం మాట్లాడమని గాంధీ మనకు బోధించారు.

    Sayani Gupta reacted to Shah Rukh Khans post

    గాంధీ గారు కూడా మన దళిత సోదర సోదరీమణుల కోసం, అణగారిన, దోపిడీదారుల కోసం, దళితుల కోసం మాట్లాడమని బోధించారు. కేవలం చెవులు, కళ్లు, నోరు మూసుకోవద్దు. మీ కళ్లను, నోటిని మూసుకోకండి.. సత్యం కోసం మాట్లాడండి" అంటూ సయానీ గుప్తా తన పోస్ట్ ద్వారా షారుక్ పై విమర్శలు చేసింది.

    English summary
    Sayani Gupta reacted to Shah Rukh Khan's post and urged him to speak up for Dalits and not keep his eyes, ears, and mouth shut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X