Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షారుక్ ను టార్గెట్ చేసిన సయానీ గుప్తా
మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా షారుక్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వివాదానికి కారణమయ్యింది. ఈ ట్వీట్పై ఫోర్ మోర్ షాట్స్ ఫేమ్ సయాని గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. కింగ్ ఖాన్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేసింది . గాంధీ జయంతి సందర్భంగా షారుక్ ఖాన్ 'ఈ సమయంలో మన పిల్లలకు ఒకే ఆదర్శం బోధించాలి. పిల్లలు చెడు వినకూడదు.. చూడకూడదు.. మాట్లాడకూడదు. 151వ జయంతి సందర్భంగా గాంధీ విలువలను స్మరించుకోవాలి' అంటూ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఫోర్ మోర్ షాట్స్ ఫేమ్ నటి సయానీ గుప్తా ఈ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరూ నిజం మాట్లాడడానికి సాహసికమని, హక్కుకోసం గళం ఎత్తాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. " 'పిల్లలకు మంచి విషయాల గురించి చెప్పండి. సత్యం కోసం మాట్లాడమని గాంధీ మనకు బోధించారు.
గాంధీ గారు కూడా మన దళిత సోదర సోదరీమణుల కోసం, అణగారిన, దోపిడీదారుల కోసం, దళితుల కోసం మాట్లాడమని బోధించారు. కేవలం చెవులు, కళ్లు, నోరు మూసుకోవద్దు. మీ కళ్లను, నోటిని మూసుకోకండి.. సత్యం కోసం మాట్లాడండి" అంటూ సయానీ గుప్తా తన పోస్ట్ ద్వారా షారుక్ పై విమర్శలు చేసింది.