Don't Miss!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షారుక్ ను టార్గెట్ చేసిన సయానీ గుప్తా
మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా షారుక్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వివాదానికి కారణమయ్యింది. ఈ ట్వీట్పై ఫోర్ మోర్ షాట్స్ ఫేమ్ సయాని గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. కింగ్ ఖాన్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేసింది . గాంధీ జయంతి సందర్భంగా షారుక్ ఖాన్ 'ఈ సమయంలో మన పిల్లలకు ఒకే ఆదర్శం బోధించాలి. పిల్లలు చెడు వినకూడదు.. చూడకూడదు.. మాట్లాడకూడదు. 151వ జయంతి సందర్భంగా గాంధీ విలువలను స్మరించుకోవాలి' అంటూ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఫోర్ మోర్ షాట్స్ ఫేమ్ నటి సయానీ గుప్తా ఈ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరూ నిజం మాట్లాడడానికి సాహసికమని, హక్కుకోసం గళం ఎత్తాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. " 'పిల్లలకు మంచి విషయాల గురించి చెప్పండి. సత్యం కోసం మాట్లాడమని గాంధీ మనకు బోధించారు.
గాంధీ గారు కూడా మన దళిత సోదర సోదరీమణుల కోసం, అణగారిన, దోపిడీదారుల కోసం, దళితుల కోసం మాట్లాడమని బోధించారు. కేవలం చెవులు, కళ్లు, నోరు మూసుకోవద్దు. మీ కళ్లను, నోటిని మూసుకోకండి.. సత్యం కోసం మాట్లాడండి" అంటూ సయానీ గుప్తా తన పోస్ట్ ద్వారా షారుక్ పై విమర్శలు చేసింది.