Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డ్రగ్స్ కేసులో కంగనా కూడా.. నెక్స్ట్ టార్గెట్ వారిపైనే: సీనియర్ హీరోయిన్ నగ్మా
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకి మరింత సీరియస్ గా మారుతోంది. సుశాంత్ కేసు నుంచి ఊహించని మలుపులు తిరిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్పెషల్ గా హీరోయిన్స్ పై స్పెషల్ ఫోకస్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అగ్ర నటీనటులకు నోటీసులు అందే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరిని విచారణకు పిలవబోతున్నారు. ఇక ఈ విషయంలో సీనియర్ నటి నగ్మా సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారికి సమన్లు ఎందుకు పంపలేదు
డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ - రకుల్ ప్రీత్ సింగ్ లను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఆ విషయంలో సీనియర్ హీరోయిన్ కాంగ్రెస్ నేత నగ్మా తీవ్ర స్థాయిలో ఎన్సీబీ తీరును తప్పు బట్టారు. డ్రగ్స్ తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించిన వారికి ఎందుకు సమన్లు పంపించలేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.
కంగనా కూడా డ్రగ్స్ తీసుకుంది
ఇటీవల కంగనా రనౌత్ తాను కూడా ఒకప్పుడు డ్రగ్స్ కి బానిసైనట్లు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే మరికొందరు కూడా గతంలో వారు డ్రగ్స్ వల్ల ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పారు. అయితే కంగనా రనౌత్ ని ఇప్పుడు ఎందుకు విచారించడం లేదని నగ్మా ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.
లీక్ చేయడమే ఎన్సీబీ అధికారులకు డ్యూటీనా?
నగ్మా ఈ విధంగా ట్వీట్ చేసింది.. గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు కంగనా రనౌత్ స్వయంగా వెల్లడించింది. అయినా NCB అధికారులు విచారణకు ఎందుకు పిలవలేదు. వాట్సాప్ చాట్ ద్వారానే పట్టుకున్న అధికారులు. బహిరంగంగా ఒప్పుకుంటున్న వారిపై దృష్టి ఎందుకు పెట్టడం లేదు? ఇక టాప్ హీరోయిన్స్ కి సంబంధించిన విషయాలను మిడియాకు లీక్ చేయడమే ఎన్సీబీ అధికారులకు డ్యూటీనా?.. అని నగ్మా తనదైన శైలిలో ప్రశ్నించింది.
నెక్స్ట్ టార్గెట్ వారే..
అదే విధంగా ఆమె కొన్ని ఫొటోలను జత చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారినే ఈ విధంగా టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఇక నెక్స్ట్ స్వర భాస్కర్ - రిచా చద్దా - అనుభవ్ సిన్హా వంటి వారు కూడా లైన్ లో ఉన్నారని వారి ఫొటోలను కూడా నగ్మా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుటి వరకు ప్రతి ఒక్క కౌంటర్ కి రీ కౌంటర్ ఇచ్చిన కంగనా ఇప్పుడు నగ్మా కామెంట్స్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.