Don't Miss!
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తండ్రి కొడుకులుగా కింగ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'జీరో' తర్వాత ఇంతవరకు సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయన మూడు చిత్రాలకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. వీటిలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్', రాజ్కుమార్ హిరాణీతో ఓ సోషల్ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రం చేయనున్నారట షారుఖ్.
అయితే కింగ్ ఖాన్ ,డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. 'అదిరింది, విజిల్' లాంటి సినిమాల ద్వారా సౌత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అట్లీ.. బాలీవుడ్లోనూ తన మ్యాజిక్ చూపేందుకు కష్టపడుతున్నాడు.
ఈ క్రమంలోనే అట్లీ.. సక్సెస్ సీక్రెట్ను రిపీట్ చేయబోతున్నాడు . హీరోను డబుల్, ట్రిపుల్ రోల్లో చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ డైరెక్టర్ కింగ్ ఖాన్ విషయంలోనూ ఇదే ఫాలో అవబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో షారుఖ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ లో షారుఖ్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడట. తండ్రి ఇన్వెస్టిగేషన్ అధికారిగా, కొడుకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా రెండు పాత్రల్లో షారుఖ్ సందడి చేయనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.