Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తండ్రి కొడుకులుగా కింగ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'జీరో' తర్వాత ఇంతవరకు సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయన మూడు చిత్రాలకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. వీటిలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్', రాజ్కుమార్ హిరాణీతో ఓ సోషల్ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రం చేయనున్నారట షారుఖ్.
అయితే కింగ్ ఖాన్ ,డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. 'అదిరింది, విజిల్' లాంటి సినిమాల ద్వారా సౌత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అట్లీ.. బాలీవుడ్లోనూ తన మ్యాజిక్ చూపేందుకు కష్టపడుతున్నాడు.
ఈ క్రమంలోనే అట్లీ.. సక్సెస్ సీక్రెట్ను రిపీట్ చేయబోతున్నాడు . హీరోను డబుల్, ట్రిపుల్ రోల్లో చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ డైరెక్టర్ కింగ్ ఖాన్ విషయంలోనూ ఇదే ఫాలో అవబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో షారుఖ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ లో షారుఖ్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడట. తండ్రి ఇన్వెస్టిగేషన్ అధికారిగా, కొడుకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా రెండు పాత్రల్లో షారుఖ్ సందడి చేయనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.