Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
షాహీద్ కపూర్ ప్రభుత్వ ఆదేశాల బేఖాతరు.. డేంజరస్ సిట్యుయేషన్లో భార్యతో కలిసి అక్కడికి..
దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దానిని అరికట్టేందుకు కఠినచర్యలు తీసుకొంటున్నాయి. ఈ మేరకు సినిమా హాళ్లను, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ను, ఇతర మాల్స్ను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. అదే కోవలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకొంది. అన్ని రకాల షాప్స్ను, మాల్స్ను క్లోజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 50కి పైగా కేసులు, మూడు మరణాలు సంభవించడంతో కఠినంగా వ్యవహారించాలని భావిస్తున్నది. అయితే ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ తన భార్యతో కలిసి ఏం చేశాడంటే..
థాక్రే ప్రభుత్వం సీరియస్గా
రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే మార్చి 13న అధికారులకు అల్టీమేటం ఇచ్చారు. ముంబై, నవీ ముంబై, థానే, నాగ్పూర్, పింప్రి ఇతర ప్రాంతాల్లో సినిమా హాళ్లను, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ను, ఇతర మాల్స్ మూసివేతకు ఆదేశాలిచ్చారు. దాంతో పలు పట్టణాలు నిర్మానుశ్యంగా మారాయి.
భార్యతో కలిసి షాహీద్ కపూర్
ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ తన భార్య మీరా రాజ్పుత్తో కలిసి నగర శివారులోని ఓ జిమ్కు వెళ్లి రావడం మీడియా కంటపడింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వారి కోసం జిమ్ను తెరిచి ఉంచారనే విషయాన్ని బాలీవుడ్ పత్రికలు కథనాన్ని వెల్లడించాయి.
షాహీద్ కపూర్ ఎందుకు వచ్చారంటే
షాహీద్ కపూర్ కోసం జిమ్ తెరిచారనే వార్తల నేపథ్యంలో దానిని నిర్వాహకుడు స్పందించారు. షాహీద్ చంఢీగఢ్లో షూటింగ్ చేస్తున్నారు. ఓ పరికరం గురించి ఆయన అడిగి తెలుసుకోవడానికి వచ్చారు. ఆయన గాయంతో బాధపడుతుండటం వల్ల ఆ పరికరాన్ని ఎలా వాడాలో తెలుసుకొనేందుకు వచ్చారు. దాని గురించి అడిగి తెలుసుకొన్నాడు. ఆయన ఇంటిలోనే వర్కవుట్స్ చేయడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసుకొన్నారు అని యుధిష్టర్ జైసింగ్ తెలిపారు.
నాకు వారు సన్నిహితులు
షాహీద్ కపూర్ దంపతులు తనను మర్యాదపూర్వకంగానే కలువడానికి వచ్చారు. అంతేగానీ జిమ్లో వర్కవుట్స్ చేయడానికి రాలేదు. ఆదివారం సాయంత్రం పూట సరదాగా మాట్లాడేందుకు వచ్చారు. వారిద్దరు నాకు మంచి స్నేహితులు అని యుధిష్టర్ పేర్కొన్నారు.
Recommended Video
జెర్సీకి కరోనా బ్రేక్
ప్రస్తుతం షాహీద్ కపూర్ జెర్సీ సినిమా రీమేక్లో నటిస్తున్నారు. కరోనావైరస్ కారణంగా సినిమా షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ప్రస్తుతం కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా మేము జెర్సీ సినిమా షూటింగ్ను వాయిదా వేశాం. చిత్ర యూనిట్ సభ్యులందరూ వారి ఫ్యామిలీస్తో క్షేమంగా ఉన్నారు అని షాహీద్ కపూర్ అన్నారు.