Don't Miss!
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘జెర్సీ’పై బాలీవుడ్ హీరో ప్రశంసలు: వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతూ ఎమోషనల్
వరుస పరాజయాలతో బాధ పడుతున్న సమయంలో నేచురల్ స్టార్ నానిని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం 'జెర్సీ'. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తమ తమ భాషల్లోకి రీమేక్ చేసుకోడానికి అన్ని ఇండస్ట్రీలకు చెందిన ఫిల్మ్ మేకర్లు హైదరాబాద్ క్యూ కట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్ హిట్ సినిమా హక్కులను సొంతం చేసుకుని జెర్సీని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు తెలుగు నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న హిందీ 'జెర్సీ'లో బాలీవుడ్ స్టార్ హీరో షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దీన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం షాహీద్ కపూర్ కూడా చాలా కష్ట పడుతున్నాడు. ఒకానొక సమయంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయ పడ్డాడు కూడా. అంతలా కష్టపడి చేస్తున్న ఈ సినిమాపై తాజాగా అతడు ఓ ఎమోషనల్ నోట్ను విడుదల చేశాడు. అందులో చిత్ర యూనిట్తో పాటు కథపై ప్రశంసల వర్షం కురిపించాడు.
'జెర్సీ' మూవీ గురించి తన ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్లో 'కోవిడ్ సమయంలోనూ జెర్సీ షూటింగ్ను 47 రోజుల పాటు జరిపాం. క్లిష్ట పరిస్థితుల్లోనూ సినిమా కోసం కష్ట పడిన అందరికీ ధన్యవాదాలు. మీరు చేసిన కృషి వల్లే షూటింగ్ త్వరగా పూర్తయింది. ఇక, ఈ సినిమా కథ కూడా ఎంతో స్వచ్చమైనది. సరైన లక్ష్యం ఉంటే దేనికీ లొంగకుండా దానిని సాధించే వరకూ పొరాడడమే ఈ చిత్ర కథ. కరోనా విషయంలోనూ మనమందరం అదే ఫాలో అవుదాం' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక, ఈ సినిమాను విడుదల చేసేందుకు నెట్ఫ్లిక్స్ ముందుకొచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.