Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
లక్ష ఇవ్వడమే ఎక్కువన్నారు.. కానీ తెలుగు కథతో అతని జీవితమే మారిపోయింది.. 45కోట్లా?
సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఇప్పుడున్న స్టార్ హీరోలు కష్టపడి పైకి వచ్చినవారే. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా ఆడియెన్స్ ని మెప్పించకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. ఎలాంటి వారైనా సరే ఎదో ఒక రకంగా కష్టపడి పైకి రావాల్సింది. ఇక క్రేజ్ వచ్చిన తరువాత దాన్ని నిలబెట్టుకోవడం అంతకు మించిన మరో భారం. ఇక కెరీర్ లో ఒకే ఒక్క తెలుగు కథతో ఒక బాలీవుడ్ హీరో జీవితమే మారిపోయింది.
అర్జున్ రెడ్డి కథతో 300కోట్లకు పైగా కలెక్షన్స్..
ఆ హీరో మరెవరో కాదు. షాహిద్ కపూర్. తెలుగులో బాక్సాఫీస్ హిట్ గా నిలిచి 30కోట్లకు పైగా లాభాలను అందించిన అర్జున్ రెడ్డి కథను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ తెలుగు కథతో షాహిద్ ఏకంగా 300కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక మార్కెట్ పెరగడంతో ఈ టాలెంటేడ్ హీరో కెరీర్ లో మొదటిసారి అత్యదిక స్థాయిలో రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచాడు.
లక్ష రూపాయలు ఇవ్వడమే ఎక్కువన్నారు..
ఈ హీరోకు లక్ష రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడమే ఎక్కువ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా షాహిద్ కెరీర్ మొదట్లో పడిన ఇబ్బందులను గురించి చాలానే చెప్పాడు. కొన్నిసార్లు రెమ్యునరేషన్ ఇవ్వకుండానే చీట్ చేశారని కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు చులకనగా చూసిన వారికి దిమ్మతిరిగేలా తన మార్కెట్ తో సవాల్ విసురుతున్నాడు.
జెర్సీ రీమేక్.. రెమ్యునరేషన్ ఎంతంటే..
అసలు మ్యాటర్ లోకి వస్తే కబీర్ సింగ్ హిట్టవ్వడంతో మరో తెలుగు కథతోనే తన మార్కెట్ ని మరింత పెంచుకోవాలని ఈ యంగ్ హీరో ప్లాన్ చేసుకుంటున్నాడు. నాని హిట్ మూవీ జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు షాహిద్ 35కోట్ల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేశాడట. అలాగే సినిమా రిలీజ్ అనంతరం ప్రాఫిట్స్ లో కూడా 20శాతం షేర్స్ వచ్చేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా ఒక సినిమాకు 45కోట్ల వరకు ఆదాయాన్ని అందుకొనున్నట్లు టాక్.
Recommended Video
బడ్జెట్ రేంజ్ కూడా పెరిగింది
షాహిద్ కపూర్ అంటే మొన్నటివరకు అతని సినిమాకు 50కోట్ల బడ్జెట్ చాలా ఎక్కువ అనుకునే వారు. కానీ ఇప్పుడు ఏకంగా 150కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జెర్సీ రీమేక్ కు కథ ఒరిజినల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు షాహిద్ మరో రెండు బిగ్ బడ్జెట్ సినిమాల కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.