Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షాకింగ్ : మూడు రోజుల ముందు జెర్సీ వాయిదా.. కొంపముంచిన కరోనా.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యాంలు కూడా?
షాహిద్ కపూర్ రాబోయే చిత్రం జెర్సీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా చూడాలంటే ప్రేక్షకులు మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే
ఆసక్తిగా
డిసెంబరు 31న థియేటర్లలో విడుదల కానున్న తెలుగు జెర్సీ హిందీ రీమేక్ జెర్సీ సినిమా విడుదల తేదీ పోస్ట్ఫోన్ అయిపోయిందని సమాచారం. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జెర్సీ వాయిదా
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ క్యాన్సిల్ అవ్వడంతో మరోసారి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు వెల్లడించారు. ఈ సినిమా యొక్క పోస్టర్ను పంచుకుంటూ, ఆయన తన పోస్ట్లో జెర్సీ వాయిదా పడింది... డిసెంబర్ 31 న విడుదల కావడం లేదు... కొత్త తేదీ త్వరలో ప్రకటించబడుతుంది..., #Jersey డైరెక్ట్-టు-OTT విడుదల అవడం కూడా నిజం కాదు.
బాలీవుడ్ రీమేక్గా
అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు, ఎస్. నాగ వంశీ నిర్మాత. తెలుగులో నాని, శ్రద్దా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచి, జాతీయ అవార్డు సైతం అందుకుని బాలీవుడ్ రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రంలో షాహిద్తో పాటు నటి మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
డిసెంబర్ 31న
ఇక వీరే కాక షాహిద్ కపూర్ తండ్రి మరియు నటుడు పంకజ్ కపూర్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. షాహిద్ యొక్క ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయింది, ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీకి కరోనా వైరస్ అడ్డుపడింది. అయితే అనేక వాయిదాల అనంతరం డిసెంబర్ 31న విడుదల చేయాలనుకున్నారు. అయితే చివరి క్షణంలో నిర్ణయం తీసుకుని మేకర్స్ వాయిదా వేశారు. దేశంలో కోవిడ్ మరియు ఓమిక్రాన్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే థియేటర్లు, స్పాలు, జిమ్లు మొదలైన బహిరంగ ప్రదేశాలను మూసివేయడం ప్రారంభించాయి. ఈ కారణంగా, షాహిద్ కపూర్ మరియు మృణాల్ ఠాకూర్ నటించిన జెర్సీ సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
Recommended Video
మరో నెలలో
మరో నెలలో అంటే కొత్త సంవత్సరంలో జనవరి 7న RRR, జనవరి 14న రాధే శ్యామ్, లాంటి పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అన్ని సినిమా హాళ్లను తక్షణమే మూసివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి కారణం ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులే. ప్రస్తుతం ఢిల్లీలో 56 సినిమా హాళ్లు ఉండగా అందులో 17 మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మొత్తం స్క్రీన్ల సంఖ్య 99. వీటన్నింటినీ మూసివేయడం 83, జెర్సీ మరియు RRR బాక్సాఫీస్ కలెక్షన్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆర్డర్కు ముందు వరకు స్పాలు, జిమ్లు మరియు సినిమా హాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరిచే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ఆదేశాలతో సినిమాల విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.