Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో పెద్ద రిస్క్ చేస్తున్న షారుక్ ఖాన్.. డిజాస్టర్ కథతోనే హిట్టు కొట్టాలని..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ జీరో సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దర్శకులతో రెగ్యులర్ గా కొత్త కథలపై చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. షారుక్ అప్డేట్ ఎప్పుడు ఇస్తాడా అని అభిమానులైతే వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా బాద్ షా కనీసం క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. షారుక్ సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టె అవకాశం ఉన్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. అయినప్పటికీ ఆయన మౌనం వీడలేదు. ఇక ఇప్పుడు అభిమానులకు షాకిచ్చే మరొక రూమర్ కూడా బాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఒక ఫ్లాప్ సినిమా కథను కొనసాగించి సీక్వెల్ గా రూపొందించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.
షారుక్ కెరీర్ లో భారీ అంచనాలతో విడుదలైన సినిమా 'రాయీస్'. ఆ సినిమా విసుదలకు ముందు ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. కానీ విడుదల తరువాత ఊహించని ఫలితాన్ని అందుకుంది. సినిమా పరవాలేదు అనే విధంగా ఉందని టాక్ వచ్చినప్పుటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
అయితే ఆ సినిమా కథకు మంచి లీడ్ ఉందని అవే పాత్రలను సీక్వెల్ లో అంచనాలకు తగ్గట్లుగా చూపిస్తే హిట్టవుతుందని షారుక్ ఒక నమ్మకంతో ఉన్నాడట. రాయీస్ సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కించాలని ఒక ప్రముఖ దర్శకుడితో షారుక్ చేతులు కలిపినట్లుగా బాలీవుడ్ లో టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే