Don't Miss!
- Sports IPL 2024: ఐపీఎల్ విజేతగా నిలిచేది ఆ జట్టే- రికీ పాంటింగ్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- News మాకు ఏమిచ్చారని మీకు ఓటేయాలి: రేవంత్ రెడ్డి ఫైర్
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
- Automobiles బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
జిరాఫీని ముద్దాడి.. ప్రేమగా తినిపిస్తున్న ‘సైరా’ గాయని..
శ్రేయా ఘోషాల్ సంగీత ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు పాట పాడితే.. తెలుగు అమ్మాయే పాడింది కదా అని అనుకునేంతగా స్పష్టంగా పాడటం ఆమెకున్న బలం. ఏ భాషలో పాడినా.. పాటలోని భావాన్ని పెంచేలానే పాడుతుంది. ఆమె గొంతులోని మాధుర్యంతో పాట స్థాయిని పెంచుతుంది. తాజాగా సైరా సాంగ్ ను అద్భుతంగాపాడి అందరి ప్రశంసలు అందుకుంటుంది.
తెలుగులో ఎన్నో పాటలు పాడిన శ్రేయా ఘోషాల్.. ఇక్కడ మరెంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు అందరి దర్శకుల దగ్గర పనిచేసిన శ్రేయాకు తెలుగులో మరుపురాని హిట్ పాటలు ఉన్నాయి. ఒక్కడు (నువ్వేం మాయ చేశావో గానీ..) సినిమాతో మొదలైన తన ప్రయాణం నేటికి కొనసాగుతోంది. సైరా సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మరోసారి అందర్నీ ఆకట్టుకుంది. ఆమెతో పాటు మరో బాలీవుడ్ సింగర్ సునిధి చౌహాన్ పాడిన ఈ పాట థియేటర్లలో రోమాలు నిక్కబొడుచేలా చేస్తోంది.
జిరాఫీని ముద్దాడి.. గోరు ముద్దలు తినిపిస్తోంది..కెన్యాలోని నైరోబిలో ఉన్న జిరాఫీల కేంద్రానికి వెళ్లి ఎంజాయ్ చేసినట్లు తెలిపింది. జిరాఫీని ముద్దాడి, తినిపిస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సునిధి చౌహాన్ వావ్ అనే కామెంట్ పెట్టంది. మరి శ్రేయా ఘోషాల్ విదేశాల్లో ఉండటంతో.. తాను పాడిన పాట, సినిమా ఇంత పెద్ద హిట్ అయిందన్న సంగతి ఈ గాయనికి తెలిసిందో లేదో.