Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దువ్వాడ జగన్నాథంగా సిద్ధార్ధ్ మల్రోత్రా... రీమేక్లో బన్నీని మించేపోయేందుకు కసరత్తులు
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్ధ మల్హోత్రా స్పీడ్ చూస్తుంటే అబ్బాయి ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది మర్జావాఁ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన సిడ్, ఈ ఏడాది కూడా వరుసగా సినిమాలను లైనప్ చేసుకున్నాడు. అందులో రెండు సినిమాలు దక్షిణాది రీమేకులే కావడంతో, జనాల్లో ఆసక్తి నెలకొంది.
కొంతకాలం క్రితం తమిళ సినిమా థడమ్ రీమేక్ లో నటించేందుకు సిడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రమే తెలుగులో రామ్ పోతినేని హీరోగా రెడ్ పేరిట తెరకెక్కుతోంది. ఇకపోతే సిద్ధార్ధ్ మల్హోత్రా మరో టాలీవుడ్ చిత్రం రీమేక్ లోను తళుక్కుమనబోతున్నాడని తెలుస్తోంది.
డీజే చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించబోతున్నారన్న వార్త ఆ మధ్య బాగానే చక్కర్లు కొట్టింది. అయితే తొలుత ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ, లేదా మిలాప్ జవేరీ తెరకెక్కిస్తారని భావించారు. కానీ, నిర్మాత దిల్ రాజు ఎవరికీ హక్కులు అమ్మేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. షాహిద్ కపూర్ జర్సీ తరువాత, ముంబైకి చెందిన ఓ బ్యానర్ తో కలసి దీన్ని కో ప్రొడ్యూస్ చేయనున్నారని వినికిడి. ఈ మేరకు హీరోగా సిద్ధార్ మల్హోత్రాను ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి డీజేగా బన్నీని సిడ్ ఏమేరకు మరిపించగలడో చూడాలి.