Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దువ్వాడ జగన్నాథంగా సిద్ధార్ధ్ మల్రోత్రా... రీమేక్లో బన్నీని మించేపోయేందుకు కసరత్తులు
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్ధ మల్హోత్రా స్పీడ్ చూస్తుంటే అబ్బాయి ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది మర్జావాఁ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన సిడ్, ఈ ఏడాది కూడా వరుసగా సినిమాలను లైనప్ చేసుకున్నాడు. అందులో రెండు సినిమాలు దక్షిణాది రీమేకులే కావడంతో, జనాల్లో ఆసక్తి నెలకొంది.
కొంతకాలం క్రితం తమిళ సినిమా థడమ్ రీమేక్ లో నటించేందుకు సిడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రమే తెలుగులో రామ్ పోతినేని హీరోగా రెడ్ పేరిట తెరకెక్కుతోంది. ఇకపోతే సిద్ధార్ధ్ మల్హోత్రా మరో టాలీవుడ్ చిత్రం రీమేక్ లోను తళుక్కుమనబోతున్నాడని తెలుస్తోంది.
డీజే చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించబోతున్నారన్న వార్త ఆ మధ్య బాగానే చక్కర్లు కొట్టింది. అయితే తొలుత ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ, లేదా మిలాప్ జవేరీ తెరకెక్కిస్తారని భావించారు. కానీ, నిర్మాత దిల్ రాజు ఎవరికీ హక్కులు అమ్మేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. షాహిద్ కపూర్ జర్సీ తరువాత, ముంబైకి చెందిన ఓ బ్యానర్ తో కలసి దీన్ని కో ప్రొడ్యూస్ చేయనున్నారని వినికిడి. ఈ మేరకు హీరోగా సిద్ధార్ మల్హోత్రాను ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి డీజేగా బన్నీని సిడ్ ఏమేరకు మరిపించగలడో చూడాలి.