Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇంటిని అమ్మివేసే ఆలోచనలో హీరోయిన్? కారణం అదేనా?
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తన బాయ్ ఫ్రెండ్, లండన్ బేస్డ్ బిజినెస్మెన్ ఆనంద్ ఆహుజాను గతేడాది పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట లండన్లో సెటిలవుతారని అంతా ఊహించారు. అయితే గత సంవత్సరకాలంగా ఇద్దరూ లండన్ టు ఢిల్లీ ట్రిప్పులు కొడుతూ రెండు చోట్ల కనిపిస్తున్నారు.
తాజాగా సమాచారం ప్రకారం... సోనమ్ కపూర్ ముంబైలోని తన ఫ్లాట్ అమ్మివేయాలనే ఆలోచనకు వచ్చిందట. ఈ లగ్జరీ ఫ్లాట్ ధీరూభాయ్ అంబానీ స్కూల్ సమీపంలో ఉంది. దీన్ని అమ్మేసి లండన్ మూవ్ అయ్యే ఆలోచనలో ఉందని, అక్కడ నాటింగ్ హాల్ ప్రాంతంలో ప్రాపర్టీ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజా గతేడాది మే 8న సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం సోనమ్ ఆంటీ కవితా సింగ్ భవంతిలో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకతో పాటు అనంతరం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్లో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు.
మరో వైపు సోనమ్ సినిమాలు చేయడం కూడా బాగా తగ్గించేశారు. సెలక్టెడ్గా చేస్తున్నారు. భర్తతో కలిసి లండన్లో ఉంటూనే తనకు వీలైనప్పుడల్లా నచ్చిన సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' చిత్రం విడుదలవ్వగా.. ప్రస్తుతం 'ది జోయా ఫ్యాక్టర్' అనే చిత్రం చేస్తోంది.