Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇంటిని అమ్మివేసే ఆలోచనలో హీరోయిన్? కారణం అదేనా?
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తన బాయ్ ఫ్రెండ్, లండన్ బేస్డ్ బిజినెస్మెన్ ఆనంద్ ఆహుజాను గతేడాది పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట లండన్లో సెటిలవుతారని అంతా ఊహించారు. అయితే గత సంవత్సరకాలంగా ఇద్దరూ లండన్ టు ఢిల్లీ ట్రిప్పులు కొడుతూ రెండు చోట్ల కనిపిస్తున్నారు.
తాజాగా సమాచారం ప్రకారం... సోనమ్ కపూర్ ముంబైలోని తన ఫ్లాట్ అమ్మివేయాలనే ఆలోచనకు వచ్చిందట. ఈ లగ్జరీ ఫ్లాట్ ధీరూభాయ్ అంబానీ స్కూల్ సమీపంలో ఉంది. దీన్ని అమ్మేసి లండన్ మూవ్ అయ్యే ఆలోచనలో ఉందని, అక్కడ నాటింగ్ హాల్ ప్రాంతంలో ప్రాపర్టీ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజా గతేడాది మే 8న సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం సోనమ్ ఆంటీ కవితా సింగ్ భవంతిలో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకతో పాటు అనంతరం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్లో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు.
మరో వైపు సోనమ్ సినిమాలు చేయడం కూడా బాగా తగ్గించేశారు. సెలక్టెడ్గా చేస్తున్నారు. భర్తతో కలిసి లండన్లో ఉంటూనే తనకు వీలైనప్పుడల్లా నచ్చిన సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' చిత్రం విడుదలవ్వగా.. ప్రస్తుతం 'ది జోయా ఫ్యాక్టర్' అనే చిత్రం చేస్తోంది.