Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంటిని అమ్మివేసే ఆలోచనలో హీరోయిన్? కారణం అదేనా?
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తన బాయ్ ఫ్రెండ్, లండన్ బేస్డ్ బిజినెస్మెన్ ఆనంద్ ఆహుజాను గతేడాది పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట లండన్లో సెటిలవుతారని అంతా ఊహించారు. అయితే గత సంవత్సరకాలంగా ఇద్దరూ లండన్ టు ఢిల్లీ ట్రిప్పులు కొడుతూ రెండు చోట్ల కనిపిస్తున్నారు.
తాజాగా సమాచారం ప్రకారం... సోనమ్ కపూర్ ముంబైలోని తన ఫ్లాట్ అమ్మివేయాలనే ఆలోచనకు వచ్చిందట. ఈ లగ్జరీ ఫ్లాట్ ధీరూభాయ్ అంబానీ స్కూల్ సమీపంలో ఉంది. దీన్ని అమ్మేసి లండన్ మూవ్ అయ్యే ఆలోచనలో ఉందని, అక్కడ నాటింగ్ హాల్ ప్రాంతంలో ప్రాపర్టీ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజా గతేడాది మే 8న సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం సోనమ్ ఆంటీ కవితా సింగ్ భవంతిలో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకతో పాటు అనంతరం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్లో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు.
మరో వైపు సోనమ్ సినిమాలు చేయడం కూడా బాగా తగ్గించేశారు. సెలక్టెడ్గా చేస్తున్నారు. భర్తతో కలిసి లండన్లో ఉంటూనే తనకు వీలైనప్పుడల్లా నచ్చిన సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' చిత్రం విడుదలవ్వగా.. ప్రస్తుతం 'ది జోయా ఫ్యాక్టర్' అనే చిత్రం చేస్తోంది.