Sonu Sood :పొద్దున్నే షాకయ్యా.. ఒక్క అంగుళం కూడా లేదు.. 17 కోట్లు అందుకే దాచా.. సోనూ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల సోదాల కోసం తన ఇంటికి వచ్చిన పన్ను అధికారులను తాను చాలా జాగ్రత్తగా చూసుకున్నానని నటుడు సోనూసూద్ చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల ప్రకారం , సోను మరియు అతని సహచరులు ₹ 20 కోట్ల పన్ను ఎగవేత మరియు విదేశీ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) ఉల్లంఘనకు పాల్పడ్డారని అంటున్నారు. అయితే ఈ నాలుగు రోజుల దాడులు చాలా సాదాసీదాగా సాగిపోయాయని సోను తాజాగా వెల్లడించారు.

ది బెస్ట్ ఇచ్ఛా
ఒక ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ, సోను తన ఇంటి వద్ద తనిఖీలు చేయడానికి వచ్చిన అధికారులు కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకున్నట్లు చెప్పాడు. ఇక వారు వచ్చినప్పుడే వారికి అత్యుత్తమ రైడ్ ను అనుభవం అయ్యేలా చేస్తానని వాగ్దానం చేసాను అని, వారు వెళ్ళిపోతున్నప్పుడు వారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాను అని, వారు కూడా ఇదే తమ అత్యుత్తమ అనుభవం అని వారు ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక వారు వెళ్ళిపోతున్నప్పుడు , 'మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాను' అని చెప్పానని దీంతో మేమంతా బాగా నవ్వాము, "అని సోనూ పేర్కొన్నారు.

ఒక్క అంగుళం భూమి కూడా లేదు
నేను అవసరమైన అన్ని పత్రాలను ఐటీ అధికారులకు అందించానని అన్నారు. ఇక నాపై ఆరోపణలు చేసినట్టు లక్నో లేదా జైపూర్లో నాకు ఒక అంగుళం భూమి కూడా లేదని సోనూ చెప్పాడు. విదేశీ నిధుల విషయానికొస్తే, 3 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం రిజిస్టర్ అయిన ఏదైనా కంపెనీ, ఫండ్స్ పొందడానికి FCRA లో నమోదు చేసుకోవాలి, ఇది నా ఫౌండేషన్ రిజిస్టర్ కాదు, కాబట్టి నేను అలాంటి నిధులను తీసుకోలేనని సోనూ పేర్కొన్నారు.

అది క్రౌడ్ ఫండింగ్
అదే సమయంలో, ఏదైనా ఫౌండేషన్ పొందే ఫండ్, ఫండ్ను ఉపయోగించడానికి ఒక సంవత్సరం కాలపరిమితిని కలిగి ఉంటుంది. నిధిని వినియోగించుకోకపోతే, మీరు దానిని మరో సంవత్సరం పాటు పొడిగించవచ్చనేవి నియమాలు అని సోనూ పేర్కొన్నారు. నేను కొన్ని నెలల క్రితమే ఈ ఫౌండేషన్ని లిస్ట్ చేసాను, ఇది COVID యొక్క సెకండ్ వేవ్ సమయంలో ఉంది అని పేర్కొన్నారు. విదేశీ నిధులు ఉన్నాయని చెబుతున్నది క్రౌడ్ ఫండింగ్ అని సోను చెప్పారు. నేను జనాల నుండి నిధులను సేకరించాను. ఈ డబ్బుతో ఆసుపత్రులు మరియు వైద్య కళాశాలలు నిర్మించబడతాయని అన్నారు. ఇక ఈ డబ్బు భారతదేశానికి లేదా నా ఫౌండేషన్కు రాలేదు కాబట్టి ఈ ఆరోపణ కూడా తప్పు అని నా ఖాతాలో ఒక డాలర్ కూడా రాలేదు అని అన్నారు.

హైదరాబాద్ లో హాస్పిటల్
సోను మాట్లాడుతూ 'నేను గత 4 నెలల నుండి నిధులను సేకరించడం ప్రారంభించాను, నిబంధనల ప్రకారం, నిధులను ఉపయోగించడానికి నాకు 7 నెలలకు పైగా సమయం ఉంది. నేను ప్రజల అలాగే నేను కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేయను అని అన్నారు. నిజానికి సోనూ సూద్ హైదరాబాద్లో ఆసుపత్రిని ప్రారంభించే తన ప్రణాళికల గురించి కూడా చెప్పాడు మరియు సోనూ సూద్ రాబోయే 50 సంవత్సరాలు దానిని నడపాలని యోచనలో ఉన్నానని ఈ ధార్మిక ఆసుపత్రిలో రోగులకు ఉచిత చికిత్స కొనసాగించాలని అన్నారు. "నాకు పెద్ద కలలు ఉన్నాయి మరియు నేను ఆ మిషన్లో ఉన్నాను" అని నటుడు చెప్పాడు. తాను సేకరించిన డబ్బు నుండి ఇంకా దాదాపు 17 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయని ఆయన అన్నారు.

ఆశ్చర్యంగా అనిపించింది
ఇక సోను సూద్ తన ఇంటిపై దాడి చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఐటీ అధికారులు ఉదయాన్నే ఆకస్మికంగా దాడి చేసిన విషయం గురించి మాట్లాడుతూ అవును, కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే పన్ను అధికారి ఉదయాన్నే ఇంటికి వస్తే, అందరూ షాక్ అవుతారు అని సోనూ సూద్ అన్నారు. ఈ దాడులు కొనసాగినంత వరకు, ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని, ఎవరూ లోపలికి రాలేదని ఆయన చెప్పారు. నా చిన్న కొడుకు చాలా రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని అన్నారు.


Click it and Unblock the Notifications











