Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విజయేంద్ర ప్రసాద్ కథకు తూట్లు.. చేతులెత్తేసిన క్రిష్.. 20 కోట్లు బొక్క!
Recommended Video
బాలీవుడ్ నటులు సోను సూద్, కంగనరనౌత్ మధ్య విభేదాలతో మణికర్ణిక చిత్రం ఇబ్బందుల్లో పడింది. సోను సూద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోనుసూద్ స్థానంలో మహ్మద్ జీషన్ అయ్యుబ్ను తీసుకొని రీషూట్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, మణికర్ణిక డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి చేతులెత్తేయడంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. మణికర్ణిక సినిమా రీషూట్, సోనూసూద్, కంగన వివాదం గురించి వివరాల్లోకి వెళితే..
విజయేంద్ర ప్రసాద్ కథను
మణికర్ణిక తొలికాపీ చూసుకొన్నప్పుడు నిర్మాతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ రాసిన స్క్రిప్టుకు బదులుగా ఏదో తెరకెక్కించినట్టు భావించారట. పూర్తిస్థాయిలో స్క్రిప్టును తెరపైకి తీసుకు రాలేదని భావించారట. మణికర్ణిక క్యారెక్టర్ను సరిగా చూపించలేదనే ఫీలింగ్తో రీషూట్కు వెళ్లాలని నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారట.
45 రోజుల రీషూట్ కోసం
వాస్తవానికి మణికర్ణికకు సంబంధించి పది రోజులపాటు ప్యాచ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉండగా, అది దాదాపు 45 రోజుల రీషూట్కు దారి తీసిందట. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ.20 కోట్లను నిర్మాతలు సర్దుబాటు చేసినట్టు తెలిసింది. రీ షూట్ కోసం దర్శకుడు క్రిష్ జాగర్లముడిని సంప్రదించగా ఆయన చేతులెత్తేశాడట.
మణికర్ణికను వదిలేసిన క్రిష్
ప్రస్తుతం క్రిష్ జాగర్లముడి ఎన్టీఆర్ బయోపిక్ను తెరకెక్కించే బిజీలో ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కోసం రేయింబవళ్లు క్రిష్ కష్టపడుతున్నాడు. దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కంగనకు సోనూసూద్ ఝలక్
గతేడాది క్రిష్ చేసిన షూట్ సందర్భంగా నేను, సోను సూద్ కలిశాం. ఆ తర్వాత ప్యాచ్ వర్క్కు డేట్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం సింహా చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. రీషూట్కు డేట్స్ కేటాయించాలని నిర్మాతలు చేసిన రిక్వెస్ట్ను సోను తిరస్కరించారు అని కంగనా రనౌత్ వెల్లడించారు.