Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్రీదేవికి ఇష్టమైన రొమాంటిక్ ఫోటోను బయటపెట్టిన కూతురు జాన్వీ కపూర్
శ్రీదేవి అకాల మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా షాక్ కి గురి చేసిందనే చెప్పాలి. ఆమె కుమార్తె జాన్వి కపూర్ తరచుగా తల్లిని మిస్ అవుతున్నట్లు చెబుతూనే ఉంటుంది. ఇక రెగ్యులర్ గా ఆమె జ్ఞాపకాలని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. శ్రీదేవి మరణించి రెండేళ్లు గడిచిపోయినా కూడా ఆమె మన మద్యే ఉన్నారని అప్పుడప్పుడు జాన్వీ ఎమోషనల్ పోస్టులతో నెటిజన్ల గుండెల్ని పిండేస్తోంది.
ఇక శ్రీదేవికి ఎంతో ఇష్టమైన ఫోటోను కూడా ఇటీవల జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చెసికుంది. భర్త బోణి కపూర్, శ్రీదేవి ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్న ఫోటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. బీచ్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ జోడి చాలా బాగుందని కూడా అభిమానులు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీదేవికి అత్యంత ఇష్టమైన ఫొటోలో ఇది కూడా ఒకటి. 2018లో శ్రీదేవి ఈ లోకాన్ని విడిచివెళ్లినప్పటి నుంచి కూడా జాన్వీ కపూర్ ఖుషి కపూర్ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో తల్లికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు.
ఇక జాన్వీ కపూర్ దడక్ సినిమా అనంతరం గుంజన్ సక్సెనా బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు గాని జాన్వీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాతోనే జాన్వీకి మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె మాత్రం తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. ప్రస్తుతం కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో దోస్తానా 2 సినిమాతో పాటు మరో సినిమాతో కూడా బిజీగా మారింది. మరి ఆ సినిమాలతో అయినా ఈ బ్యూటీ సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.