Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘నిన్ను కలవాలనుంది’ అంటూ జాహ్నవి కపూర్కు లెటర్
అందాల నటి శ్రీదేవి కూతురిగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేక గుర్తుంపును తెచ్చుకుంది జాహ్నవి కపూర్. తల్లి బతికున్నప్పుడే తన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ ఊపులోనే మరికొన్నిసినిమాలకూ సంతకాలు చేసేసింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగులో పాల్గొంటోంది.
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్
పేరుకు శ్రీదేవి కూతురే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడంతో జాహ్నవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె సినిమా విడుదలవక ముందే జాహ్నవి పేరిట ఎన్నో ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు, ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తున్నా.. సదరు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడకు వాలిపోతున్నారట. గతంలో తన ఫ్యాన్స్ వల్లే జాహ్నవి ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి.
ఫ్యాన్స్ నుంచి లేఖలు
ప్రస్తుతం తన కొత్త సినిమా ‘రూహీ అఫ్జా' షూటింగ్ కోసం జాహ్నవి మనాలిలో ఉంటోంది. ఈ సమయంలో ఆమెకు యువ ఫ్యాన్స్ నుంచి ఎన్నో లేఖలు వస్తున్నాయట. ఇందుకు సంబంధించిన ఓ లేఖ మీడియా కంట పడింది. ‘‘హాయ్ జాహ్నవి మేడమ్. ఎంత వీలైతే అంత తొందరగా మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. మేమంతా మీకు పెద్ద ఫ్యాన్స్. మిమ్మల్ని కలవడం కోసం మేమంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం'' అని అందులో ఆమె అభిమానులు పేర్కొన్నారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమా
జాహ్నవి కపూర్ ప్రస్తుతం ‘రూహీ అఫ్జా' అనే సినిమా చేస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.