Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీదేవి పోస్టుమార్టంపై మరొక అనుమానం.. రిపోర్ట్స్ లీక్ చేసిన స్టార్ హీరోయిన్.. ఏది నిజం?
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అతిలోక సుందరి శ్రీదేవి ఎంతగా గుర్తింపు తెచ్చుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మూడు తరాల ఆడియెన్స్ ని తన అందంతో ఎంతగానో ఆకర్షించిన శ్రీదేవి కపూర్ మరణించి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఘటనకు సంబంధించిన ఎన్నో విషయాలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇక ఇటీవల ఆమె మరణానికి సంబంధించిన ఒక పోస్ట్ మార్టం రిపోర్టు సోషల్ కూడా మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ అర్ధరాత్రి ఏం జరిగింది..
శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహానికి వెళ్లిన శ్రీదేవి తన భర్తతో హోటల్లో బస చేసింది. అయితే అర్ధరాత్రి పార్టీ అనంతరం అనుమానాస్పదంగా బాత్ రూం టబ్లో చనిపోయిఉండడం అందరిని షాక్ కి గురి చేసింది. శ్రీదేవి మరణం వెనుక అనుమానాలు ఉన్నాయని చాలా ఆరోపణలు వచ్చాయి.
పోస్టుమార్టం రిపోర్ట్స్..
అయితే దుబాయ్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్స్ పై పెద్దగా క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వైరల్ అవ్వడంతో పలు బాలీవుడ్ మీడియా సంస్థలు అది నిజమని అనుకున్నాయి. పైగా ఆ రిపోర్ట్ ను హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి పోస్ట్ చేయడం జరిగిందని చెప్పడంతో కొంతమంది నెటీజన్స్ కూడా ఆ కథనాలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు.
అది నిజం కాదు..
ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం.. శ్రీదేవి మరణం సహజంగా జరగలేదని ఆల్కహాల్, కొకైన్ తీసుకోవడమే కాకుండా చేతికి కూడా పలు గాయాలు ఉన్నాయని దుబాయ్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. అయితే అది నిజమైనది కాదని స్పష్టంగా తెలుస్తోంది. అంతే కాకుండా కంగనా పోస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో అక్కడే క్లియర్ గా విషయం తేలిసిపోయింది. ఎందుకంటే కంగనాకు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఎకౌంట్స్ లేవు.
Recommended Video
మరణంపై అనుమానాలు..
మొత్తానికి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ రిపోర్ట్ పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది. ఇక శ్రీదేవి మరణంపై అనుమానాలు ఉన్నాయని గత ఏడాది నుంచి ఆమె దగ్గరి బంధువులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవి మేనమామ వేణుగోపాల్ రెడ్డి గతంలోనే శ్రీదేవి మరణంపై అనుమానాలు ఉన్నట్లు మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్ గా కామెంట్ చేశారు. ఆమె భర్త బోనీ కపూర్, అలాగే బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ పై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది.