Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
80కోట్ల సినిమాను బైకాట్ చేయాలంటూ అభిమానుల ఉద్యమం.. టెన్షన్లో RRR హీరో!
కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీలు చాలా దెబ్బ తింటున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్లో తెరకెక్కే బాలీవుడ్ సినిమాల పరిస్థితి అయితే చాలా దారుణంగా మారింది. అసలు రిలీజ్ అవుతాయా లేదా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. సినిమా షూటింగ్స్ పూర్తయితే పరవాలేదు గాని.. మధ్యలో ఆగిపోయిన బిగ్ బడ్జెట్ సినిమాల పరిస్థితి ఉహించడానికే కష్టంగా ఉంది. ఇక ఇప్పుడు అభిమానుల నుంచి ఒక స్టార్ హీరోకి ఊహించని విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
బైకట్ చేయాలంటూ..
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ RRR సినిమాలో మన హీరోలతో సమానంగా ఒక బలమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే తన కొత్త సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయంలో అజయ్ తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతని సినిమాను బైకట్ చేయాలంటూ అభిమానులే చెబుతుండడం అతన్ని షాక్ కి గురి చేస్తోంది.
భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
80కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాను ఓటీటీలో బైకట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంటర్నెట్ లో ఈ విధంగా నెగిటివ్ కామెంట్స్ రావాడం ఆ సినిమాకు పెద్ద దెబ్బె అని చెప్పాలి. ఎందుకంటే త్వరలో ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని బాలీవుడ్ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కావడానికి సిద్ధమయ్యాయి.
ఓటీటీ నచ్చడం లేదు
ఇక ఆ లిస్ట్ లో అజయ్ దేవ్గన్ నుంచి నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న చిత్రాల్లో భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా కూడా హాట్ స్టార్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 80కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే అజయ్ అభిమానుకు ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తుండడం నచ్చడం లేదు.
Recommended Video
ఎఫెక్ట్ పడుతుంది..
#BoycottBhujOnOTT అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అజయ్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. OTT ఫ్లాట్ ఫార్మ్ లో కూడా సినిమాకు ఆదరణ దక్కకపోతే తరువాత సినిమాపై ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. చూస్తుంటే భవిష్యత్తులో ఓటీటీల కాలమే సినిమా తారలకు చాలా ఇంపార్టెంట్ గా మారింది. మరి అజయ్ తన ఫ్యాన్స్ అభిప్రాయంపై ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.