Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సుశాంత్ సింగ్ కేసు సీబీఐ చేతికి.. రంగంలోకి కేంద్ర మాజీ మంత్రి.. ఆ సెక్షన్ల ఆధారంగా!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఘటన జరిగి దాదాపు 25 రోజులు అవుతున్నా.. ఇంకా వేడి చల్లారలేదు. నేటికీ ఆయన అభిమానులు ఆత్మహత్య కాదనీ, సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ మాఫియా, నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని కొందరు అంటుంటే, మాజీ మేనేజర్ దిశ సలియాన్, సూరజ్ పంచోలి వ్యవహారం కారణంగానే సుశాంత్ను హత్య చేశారని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలోకి కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యన్ స్వామి ఎంటరయ్యారు.
Recommended Video
సుశాంత్ ఆత్మహత్య..
సుశాంత్ సింగ్ గత నెల 14న బాంద్రాలోని అతని నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడనేది ప్రాథమిక నిర్దారణ. అయితే ఈ ఆత్మహత్య వెనుక పెద్ద కుట్రే ఉందని ప్రధాన ఆరోపణ. సీసీటీవీ పుటేజ్ మాయమైందని, సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటాడన్న విషయం మహేష్ భట్కు ముందుగానే ఎలా తెలుసని ఇలా ఏవేవో అనుమానాలు రేకెత్తాయి.
సీబీఐ ఎంక్వైరీ..
అయితే సుశాంత్కు కావాలనే ఆఫర్స్ రాకుండా చేశారని, తద్వారా డిప్రెషన్కు లోనయ్యేలా చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. మాజీ మేనేజర్ దిశ సలియాన్ మృతి, సూరజ్ పంచోలి వ్యవహారం కారణంగానే సుశాంత్ను పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే నిజానిజాలను వెలికి తీయాలని సీబీఐకి అప్పగించాలని ఫ్యాన్స్, నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఆ సెక్షన్ల ఆధారంగా..
ఇష్కరన్ భండారి అనే లాయర్ సుశాంత్ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తాడట. కచ్చితమైన ఆధారాలు, వివరాలు, సమాచారం ఉంటే అతనికి తెలియజేయండని కోరాడు. ఐపీసీ సెక్షన్ 306, 308, ఆర్టికల్ 21 ఆధారంగా మనం ఈ కేసును తగిన ఆధారాలతో సీబీఐకి అప్పగించేలా చేయొచ్చని తెలిపాడు.