Don't Miss!
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రియాతో ఆ బంధం ఏమిటీ.. సీబీఐ ప్రశ్నించలేదా? మహేష్ భట్పై సీనియర్ హీరోయిన్ ఫైర్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో సీబీఐ పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. గత పన్నెండు రోజులుగా ముంబైలో అధికారులు పలువురిని ప్రశ్నించి వాస్తవాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చకవ్రర్తి, ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తమకు తోచిన విధంగా ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో దర్శకుడు మహేష్ భట్ను ఉద్దేశించి సీనియర్ హీరోయిన్ సుచిత్ర కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..
Recommended Video
రియా, మహేష్ భట్ వాట్సాప్ ఛాట్ లీక్
సుశాంత్ మరణం కేసులో రియా చక్రవర్తి తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ చేస్తున్నది. ఈ క్రమంలోనే రియా, మహేష్ భట్ మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. సుశాంత్, రియా రిలేషన్షిప్లో మహేష్ భట్ జోక్యం ఉందనే ఆరోపణలకు ఛాటింగ్ బలం చేకూర్చింది.
పర్విన్ బాబీ మాదిరిగానే సుశాంత్ కూడా
సుశాంత్ మరణానికి ముందు మహేష్ భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ తీవ్రస్థాయిలో డిప్రెషన్లో ఉన్నారు. ఆయనకూ కూడా సూసైడ్ తప్పదు. బాలీవుడ్ నటి పర్విన్ బాబీ మాదిరిగానే సుశాంత్ కూడా అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తాడనే విధంగా దర్శకుడు మహేష్ భట్ కామెంట్లు చేయడం వివాదంగా మారింది.
మహేష్ భట్ సూచనలతో రియా
అలాగే సుశాంత్ మానసిక రుగ్మతకు గురయ్యారనే వార్తల నేపథ్యంలో ఆయనకు వైద్యుడి సూచనలు లేకుండా ప్రమాదకరమైన డ్రగ్స్ రియా చక్రవర్తి అందించారనే విషయం మరింత సంచలనం రేపింది. మహేష్ భట్ సూచనతోనే సుశాంత్కు ప్రమాదకరమైన మందులు ఇచ్చారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి ఆరోపణల మధ్య నటి సుచిత్ర కృష్ణమూర్తి ట్వీట్ బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
రియాను సీబీఐ ప్రశ్నించలేదా?
సుశాంత్ మరణం కేసులో మహేష్ భట్ను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు పంపిందా? ఆయన అంత మొండిగా ఎందుకు ఉన్నారు? జూన్ 8వ తేదీన సుశాంత్ను రియా విడిచి పెట్టి ఎందుకు వెళ్లింది అంటూ సుచిత్ర కృష్ణమూర్తి ట్వీట్ చేశారు. రియా, మహేష్ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందనే విధంగా ఆమె ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆమె నర్మగర్భంగా ఎందుకు ట్వీట్ చేశారనే విషయం కొందరికి అంతుచిక్కకుండా అనుమానాలను రేకెత్తించింది.
లీకైన వాట్సాప్ ఛాటింగ్లో
జూన్ 8వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంటి నుంచి రియా చక్రవర్తి వెళ్లిన తర్వాత ఆమెకు మహేష్ భట్కు మధ్య వాట్సాప్లో చాటింగ్ జరిగింది. వెనకకు తిరిగి విషయాలను చూసుకోకు. ఏది అనివార్యమనే విషయం సాధ్యమో చూసుకోవాలి. నీ నిర్ణయంపై నీ తండ్రి హ్ాయపీగా ఫీలవుతారు. ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేయండి అంటూ మహేష్ భట్ మెసేజ్ పంపారు.