Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సుశాంత్ మంచోడా చెడ్డోడా అన్నది కాదు.. పోలీసులను విచారించనివ్వండి.. సుప్రీంకోర్టు కామెంట్స్
సుశాంత్ సింగ్ మరణం ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. సుశాంత్ ప్రాణాలు వదిలి నెల రోజులు దాటినా ఏ ఒక్క విషయం బయటకు రాలేదు. రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇన్ని రోజులు బాలీవుడ్ మాఫియా, నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంతా భావించారు. అయితే సుశాంత్ కుటుంబం మాత్రం రియాపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కేసులో అదిరిపోయే ట్విస్ట్ ఏర్పడింది. గత రెండు మూడు రోజుల నుంచి రియా చక్రవర్తి చుట్టే ఉచ్చు బిగుస్తోందన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలనే వాదనపై సుప్రీం కోర్టు స్పందించింది.
Recommended Video
సుశాంత్ తండ్రి ఆరోపణలు..
సుశాంత్ సింగ్ మరణంపై సోషల్ మీడియాలో రోజుకో వాదన వినిపిస్తూ ఉండేది. ఒక రోజు కరణ్ జోహర్, మరొక రోజు సల్మాన్ ఖాన్, ఇంకో రోజు మహేష్ భట్ ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్పై ఆరోపణలు వినిపిస్తూనే వచ్చాయి. అయితే తాజాగా సుశాంత్ తండ్రి ఆరోపణలతో మొత్తం మారిపోయింది.
డబ్బు కాజేసింది..
తన కుమారుడు సుశాంత్కు ఓవర్ డోస్ మందులు ఇచ్చేదని, గత కొన్ని రోజులుగా బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బులు తీసుకుని వాడుకుందని, దాదాపు 15 కోట్లు మాయమయ్యాయని ఆరోపణలు చేశాడు. అన్ని అవసరాలకు సుశాంత్ డబ్బే వాడిందని, ఆమె వల్లే అంతా జరిగిందని రియాపై ఫిర్యాదు చేశారు.
అరెస్ట్ అంటూ వార్తలు..
రియాపై సుశాంత్ తండ్రి ఆరోపణలు, బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వార్తలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఈ నేపథ్యంలో రియాను అరెస్ట్ చేయబోతోన్నారంటూ ప్రచారం కావడం అందరికీ షాక్ అనిపించింది. ఆమె కూడా లాయర్ను సంప్రదించి ముందస్తు బెయిల్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
సీబీఐకి అప్పగించాలని..
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని ఎప్పటి నుంచో వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అల్క ప్రియ అనే అభిమాని వేసిన పిల్ను సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. సుశాంత్ మంచి నటుడు, ఎంతో మందికి సాయం చేశాడు. అతని కేసును సీబీఐకి అప్పగించడని అందులో పేర్కొంది.
మంచోడా? చెడ్డొడా? అని కాదు..
అయితే ఆ పిల్ను ధర్మాసనం కొట్టివేస్తూ.. ‘సుశాంత్ మంచి వాడా? చెడ్డవాడా? అని కాదు పోలీసులు విచారణ జరపుతున్నారు.. వారిని విచారించనివ్వండ'ని సీబీఐకి అప్పగించే నిర్ణయాన్ని పక్కకు పెట్టేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ముంబై పోలీసుల మీద ట్రోలింగ్ జరుగుతోంది. షేమ్ ఆన్ ముంబై పోలీస్ అంటూ హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు.