Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుశాంత్ కేసులో మేనేజర్ అరెస్ట్?.. రియా చక్రవర్తి నివాసంపై మెరుపుదాడులు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసుతో డ్రగ్స్ మాఫియాకు లింకులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సెప్టెంబర్ 4వ తేదీన కొరడా ఝులిపించింది. ఈ కేసుతో సంబంధమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ హౌస్ మేనేజర్ను ఎన్సీడీ అదుపులోకి తీసుకొన్నది. దీంతో ఈ కేసులో మరో అరెస్ట్ జరిగినట్టు అధికారులు ధృవీకరించారు. అయితే ఈ కేసు దర్యాప్తు సంచలన దిశగా సాగుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఈ కేసు దర్యాప్తు వివరాలు ఇలా ఉన్నాయి.
Recommended Video
సినీ హీరో, దర్శకుడు, రాజకీయ వేత్తలకు లింక్
బాలీవుడ్కు డ్రగ్స్ మాఫియా సంబంధాలపై దర్యాప్తునకు రంగంలోకి దిగిన నార్కోటిక్స్ బృందం వేగంగా పావులు కదిపింది. డ్రగ్స్ సప్లయిర్ల డొంక కదిలించడంతో పలువురు పేర్లు బయటకు వచ్చాయి. వారిని విచారించగా బాలీవుడ్లో ఓ అగ్ర హీరోకు, దర్శకుడితోపాటు మరో ఇద్దరు రాజకీయ నేతలకు సంబంధాలున్నట్టు గుర్తించింది.
రియా వాట్సాప్ ఛాటింగ్ లీక్
ఇక రియా చక్రవర్తితో మహేష్ భట్ జరిపిన ఛాటింగ్, అలాగే డ్రగ్స్ సప్లయిర్ జయ సహాతో జరిపిన వెబ్ ఛాటింగ్ లీక్ కావడంతో ఎన్సీబీ మరింత వేగంగా స్పందించింది. రియా చక్రవర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెతోపాటు సుశాంత్ మేనేజర్ శ్యామూల్ మిరాండాను వరుసగా మూడు నాలుగు రోజులు ప్రశ్నించింది.
శ్యామూల్ నివాసంలో రెండు గంటలపాటు
సుశాంత్ కేసు దర్యాప్తులో భాగంగా ముంబైలోని సహార్లోని శ్యామూల్ నివాసంలో రెండు గంటలపాటు సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ 67 ప్రకారం సమన్లు జారీ చేసింది. సోదాల నేపథ్యంలో భారీగా హాజరైన మీడియా ముందే శ్యామూల్ను అదుపులోకి తీసుకొంది. ఈ కేసులో మరింత లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నది.
షోవిక్ చక్రవర్తికి సంబంధాలు
సుశాంత్ మరణం కేసులో భాగంగా డ్రగ్ సప్లయిర్ జైద్ విలాత్రాను అరెస్ట్ చేసిన రోజే శ్యామూల్ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. జైద్తో శ్యామూల్, షోవిక్ చక్రవర్తి చర్చలు జరిపినట్టు ఆధారాలు లభ్యం కావడంతో నార్కోటిక్స్ విభాగం ఈ నిర్ణయం తీసుకొన్నది. గతంలో బయటపడిన వాట్సాప్ ఛాట్లో 5 గ్రాముల నిషేధిత డ్రగ్స్ కోసం శ్యామూల్ 10 వేల రూపాయలు చెల్లించినట్టు స్పష్టమైంది.
శుక్రవారం ఉదయమే మెరుపుదాడులు
ఇదిలా ఉండగా, శుక్రవారం రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి ఇంటిలో కూడా నార్కోటిక్స్ విభాగం సోదాలు నిర్వహించింది. దర్యాప్తులో భాగంగానే సోదాలు నిర్వహించాం. నిబంధనలకనుగుణంగా మాత్రమే సోదాలు నిర్వహిస్తున్నాం. రియా, శ్యామ్యూల్ మిరాండా నివాసాలపై సోదాలు నిర్వహించాం అని నార్కోటిక్ అధికారులు స్పష్టం చేశారు.