Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రియా చక్రవర్తి గోల్మాల్.. ఆదాయానికి మించి ఆస్తులు.. ఆ రెండు బ్యాంకులపై ఈడీ నజర్!
బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి సంబంధించిన ఆస్తులు ఆదాయానికి మించి ఉండటంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) తీవ్రంగా పరిగణిస్తున్నది. ఆదాయానికి మంచి ఆస్తులు ఉండటంపై అడిగిన లెక్కలకు రియా పొంతన లేని సమాధానాలివ్వడం, జవాబు దాటవేసేందుకు ప్రయత్నించడం ఈ కేసులో సీరియస్గా మారింది. తన కుమారుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం జరిగిందని తండ్రి కేకే సింగ్ పాట్నాలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయడంతో రియాను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రూ.15 కోట్ల దుర్వినియోగం
సుశాంత్ సింగ్ రాజ్పుత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్ల అక్రమంగా బదిలీ అయ్యాయి. భారీగా డబ్బును దుర్వినియోగం చేశారు అని కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సుశాంత్ స్థాపించాలనుకొన్న కంపెనీల్లో కొన్ని ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. దాంతో రియాపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు. గత నాలుగురోజుల్లో రియాను రెండుసార్లు ప్రతీ రోజు 9 గంటలపాటు ప్రశ్నించారనే విషయం తెలిసిందే.
అనూహ్యంగా పెరిగిన స్థిరాస్తులు
ఈడీ పరిశీలనలోకి వచ్చిన సమాచారం ప్రకారం.. 2018-19లో రియా స్థిర ఆస్తులు 96 వేల నుంచి 9 లక్షల రూపాయలకు పెరిగాయి. రియా ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేయడానికి నిధులు ఎలా వచ్చాయనే విషయంపై ప్రశ్నించగా రియా సమాధానాలు చెప్పడానికి నిరాకరించారు. తన అకౌంట్లోకి వచ్చిన డబ్బు గురించి ఆరా తీస్తే లెక్కలు చెప్పడానికి నిరాకరించారు.
ఆదాయానికి మించి షేర్ల కొనుగోలు
రియా చక్రవర్తి వార్షిక ఆదాయం మాత్రం కేవలం 18 లక్షలు మాత్రమే ఉన్న సమయంలో 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 34 లక్షల మేర షేర్స్ కొనుగోలు చేశారు. 2018లో షేర్ల కొనుగోలు విలువ 34 లక్షల రూపాయల నుంచి 42 లక్షల రూపాయల మేర పెరిగింది అనే విషయాన్ని ఈడీ నుంచి మీడియా సేకరించినట్టు సమాచారం.
24 నగదు చెల్లించి ఫ్లాట్ కొనుగోలు
రియా చక్రవర్తి 2018లో ముంబైలోని ఖార్లో 24 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఆ నగదుకు సంబంధించిన వివరాల గురించి రియా చక్రవర్తిని ప్రశ్నించగా వాటికి ఆధారాలు చూపడంలో తడబాటు గురయ్యారనే విషయం ఈడీ విచారణలో వెలుగు చూసింది.
Recommended Video
ఆ రెండు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు
రియా చక్రవర్తికి సంబంధించి ఇలాంటి వ్యవహారాలే కాకుండా హెఛ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి కూడా ఈడీ ఆరా తీసింది. తన ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంపై ఈడీ ప్రశ్నలు వేయగా వాటికి కూడా సమాధానాలు చెప్పలేక తప్పించుకొనే ప్రయత్నం చేశారనే విషయం బయటకు వచ్చింది. ఇంకా లెక్క తేలని ప్రశ్నలు ఉన్నందున రియా చక్రవర్తిని ఈడీ అధికారులు మరోసారి పిలిచే అవకాశం ఉంది.