Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం.. రియా చక్రవర్తికి మరో ఊరట
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సుశాంత్ సింగ్ది హత్య కాదు.. ఆత్మహత్యే అంటూ దర్యాప్తు సంస్థలు ధృవీకరిస్తున్నాయి. ఈ క్రమంలో రియా చక్రవర్తికి సంబంధించిన మరో విషయం కూడా బయటకు వచ్చింది.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత తన కుమారుడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రియా చక్రవర్తి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిందని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈడీ, సీబీఐ, ఎన్సీబీ లాంటి సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు చేశాయి.
సుశాంత్ సింగ్ రాజ్ మరణంలో హత్య కోణం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. కాబట్టి తాము ఆత్మహత్య, అందుకు ప్రేరేపించిన కారణాల దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అలాగే కేకే సింగ్ ఆరోపించినట్టుగా రియా డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆడిట్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆ కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయంపై స్పష్టత కానరాలేదు అని సీబీఐ వర్గాలు వెల్లడించినట్టు ఇండియాటుడే కథనాన్ని వెల్లడించింది.
అంతేకాకుండా సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్, సుశాంత్ మరణానికి లింకు ఉన్నట్టు వస్తున్న వార్తలకు సంబంధించి బలమైన ఆధారాలు లభించలేవు అని సీబీఐ అధికారులు చెప్పినట్టు కథనంలో పేర్కొన్నది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఊహించని పరిస్థితుల్లో జూన్ 14వ తేదీన తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించడం అందర్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో యాక్సిడెంటల్ మరణంగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.