Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో బ్రిటన్ వ్యాపారవేత్త అరెస్ట్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పంజా విసిరింది. డ్రగ్స్ కేసులో బ్రిటన్ పౌరుడు, వ్యాపారవేత్త కరణ్ సంజానీ, సెలబ్రిటీ మేనేజర్ రహిలా ఫర్నీచర్వాలాను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
మీడియా రిపోర్టు ప్రకారం.. గత నెల రహిలా, కరణ్ 200 కేజీల డ్రగ్స్తో పట్టుబడటంతో వారిని జుడిషియల్ కస్టడీకి తరలించారు. విచారణ నిమిత్తం ఫిబ్రవరి 4వ తేదీ ఎన్సీబీ కార్యాలయానికి పిలిచి అరెస్ట్ చేశారు.
సుశాంత్ సింగ్ డెత్ కేసుతో సంబంధమున్న డ్రగ్స్ వ్యవహారంలో రహిలా ఫర్నీచర్ వాలా, కరణ్ సంజానీని అరెస్ట్ చేశాం అని ఎన్సీబీ ప్రకటనను విడుదల చేసింది. సుశాంత్ మరణం కేసులో జగదీప్ సింగ్ ఆనంద్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని ప్రకటనలో పేర్కొన్నది. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కరమ్ జీత్కు జగదీప్ సింగ్ సోదరుడు కావడం గమనార్హం.
రహిలా ఫర్నీచర్ వాలా, కరణ్ సంజానీతోపాటు జగదీప్ సింగ్ ఆనంద్ను త్వరలోనే విచారిస్తాం. వారిని రిమాండ్లోకి తీసుకొని ప్రశ్నిస్తాం అని ఎన్సీబీ పేర్కొన్నది. ఇదిలా ఉండగా, రహిలా ఫర్నీచర్ వాలా, కరణ్ సంజానీ శుక్రవారం బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.