Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సుశాంత్ డెత్ కేసులో రియాకు మరో షాక్: సీబీఐ దర్యాప్తుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సంచలనంగా మారుతోంది. గత కొన్ని వారాలుగా కేసుని సీబీఐకి అప్లగించాలని సాధారణ జనాల నుంచి ప్రముఖ సెలబ్రెటీస్ వరకు అందరూ సోషల్ మీడియా ద్వారా వారి భావాన్ని తెలియజేశారు. ఇక ఎట్టకేలకు సీబీఐ విచారణకు ఆమోదం లభించింది. సీబీఐ విచారణ కోసం బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా వెంటనే గ్రీన్ సిగ్నల్ లభించింది.
Recommended Video
సీబీఐ చేతుల్లోకి సుశాంత్ కేసు
ముంబై నగర పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సుశాంత్ సింగ్ బీహార్ లో కేసు నమోదు చేయగా వారు కూడా సుశాంత్ కేసుపై తీవ్ర స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో బీహార్ పోలీసులు ముంబై పోలీసులకు సహకరించడం లేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక మొత్తానికి కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లబోతోంది.
ముంబై పోలిసులకు కోర్టు ఆదేశాలు
అయితే ఒకే కేసును ఇరు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తుపై అసహనం వ్యక్తం చేసిన రియా చక్రవర్తి కేసును ముంబై పోలీలులే విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక కేసులో సాక్ష్యాలు తారుమరయ్యాయని సుశాంత్ తండ్రి తరపు లాయర్ కోర్టులో వాదించగా.. ఈ విషయంపై స్పందించిన కోర్టు మూడు రోజుల్లో ముంబై పోలీసులు ఇన్ని రోజులు చేసిన దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్స్ ని సమర్పించాలని ఆదేశించింది.
నిజానిజాలు వీలైనంత త్వరగా తెలియాలి..
ప్రతిభావంతుడైన సుశాంత్ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తి అనుమానాస్పధంగా మరణించారు అంటూ.. ఈ కేసులో నిజానిజాలు వీలైనంత త్వరగా తెలియాలని కోర్టు పోలిసులకు తెలిపింది. ఇక బీహార్ పోలీస్ అధికారిని క్వారంటైన్ చేయడం కూడా మంచి సంకేతం కాదని కూడా న్యాయం స్థానం హెచ్చరించింది.
మరో మూడు రోజుల్లో..
కోర్టు చెప్పిన దాన్ని బట్టి చూస్తే..మరో మూడు రోజుల్లో సుశాంత్ డెత్ కేసులో మరో మలుపు తిరగబోతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ చనిపోవడానికి ప్రధానం కారణం రియా చక్రవర్తి అంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు విషయంలో భవిష్యత్తులో రియా మరిన్ని విచారణలలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.